Home Business LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు

LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు

0
10
LPG Rates
Spread the love

LPG Rates : ఉజ్వల్ పథకం, (PMUY), ఉజ్జ్వల్ పథకం కాని వినియోగదారులకు రేపు ఉదయం నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) ధర సిలిండర్‌కు రూ.50 పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు. వంట గ్యాస్ లేదా ఎల్‌పిజి ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని చెప్పారు.

దీనితో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ (LPG Rates ) ధర రూ.500 నుండి రూ.550కి పెరుగుతుంది. ఇతరులకు, ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.803 నుండి రూ.853కి పెరుగుతుంది. రెండు వారాల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని మంత్రి చెప్పారు.LPG ధరల పెంపు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించబడుతుంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా మార్చబడుతుంది, అని ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ( BPL ) కుటుంబాలకు చెందిన మహిళలకు కట్టెల పొయ్యి, పొగలేని వంట కోసం LPGని సరఫరా చేయడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

పెట్రోల్, డీజిల్ పై ఇటీవల ఎక్సైజ్ సుంకం పెంపు గురించి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఈ భారం వినియోగదారులపై పడనీయబోమని తెలిపారు. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న రూ. 43,000 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి ఇవి సహాయపడతాయని అన్నారు.

ప్రభుత్వం పెట్రోల్. డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 కు, డీజిల్ పై లీటరుకు రూ.10కు పెంచినట్లు అధికారిక ఉత్తర్వులో తేలింది. సుంకాల పెంపు “ఏప్రిల్ 8, 2025 నుండి అమల్లోకి వస్తుంది” అని అది తెలిపింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here