తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA చారిత్రక విజయం:

Kiran Podishetty

December 13, 2025

Spread the love
  • కేరళ అధికార పార్టీ LDFకు భారీ ఎదురుదెబ్బ
  • మొదటిసారిగా తిరువనంతపురంలో మెజారిటీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి;
  • 2020లో 52 సీట్లు గెలిచిన LDF ఈసారి 29కే పరిమితం.

తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు (Kerala Local Body Election Results) అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు షాకిచ్చాయి. ముఖ్యంగా, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ (Thiruvananthapuram Corporation) లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

LDFకు భారీ ఎదురుదెబ్బ

2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అధికార LDF తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను 52 వార్డులతో కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఈసారి LDF కేవలం 29 సీట్లకే పరిమితం కావడం గమనార్హం. ఇక 2020లో 33 వార్డులను గెలుచుకున్న NDA ఈసారి 50 సీట్లకు చేరుకుని ఈ కార్పొరేషన్‌పై పూర్తి మెజారిటీ దిశగా అడుగులు వేసింది. UDF గతంలో 10 వార్డులు గెలవగా, ఈసారి 19 వార్డులను కైవసం చేసుకుంది.

ఈ ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలో కూడా LDFకు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

పోలింగ్ శాతం: 1995 తర్వాత అత్యధికం

కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ప్రకారం, ఈ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధికంగా 73.69 శాతం పోలింగ్ నమోదైంది. 1995 తర్వాత కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం.

  • మొదటి దశ (డిసెంబర్ 9): 70.91 శాతం
  • రెండవ దశ (డిసెంబర్ 11): 76.08 శాతం
పార్టీ / కూటమిగెలుచుకున్న వార్డులు
NDA (బీజేపీ కూటమి)50
LDF (లెఫ్ట్ కూటమి)29
UDF (కాంగ్రెస్ కూటమి)19
స్వతంత్రులు2
మొత్తం100 (విజింజంలో పోలింగ్ వాయిదా)

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Leave a Comment