Home World India-China tensions | ఒక మిలియన్ సుసైడల్ డ్రోన్స్ సిద్ధం చేస్తున్న చైనా!

India-China tensions | ఒక మిలియన్ సుసైడల్ డ్రోన్స్ సిద్ధం చేస్తున్న చైనా!

0
5
Indian Army heavy-duty drones
heavy-duty drones
Spread the love

China’s Kamikaze Drone Strategy | అనేక ద్వైపాక్షిక చర్చల తర్వాత భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఒక ముగింపుకు వచ్చినట్లు అనిపిస్తోంది. కానీ డ్రాగన్ దేశం ఇపుడు మనదేశంలో ఉద్రిక్తతలను (India-China tensions) పెంచే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.

భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలను సులభంగా టార్గెట్ చేయగల 100 కాదు, ఏకంగా 1 మిలియన్ సూసైడ్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని చైనా యోచిస్తున్నట్లు సమాచారం. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆదేశించిన ఈ డ్రోన్‌లను 2026 నాటికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA China army)కి అందజేయాలని భావిస్తున్న‌ది. అయితే, చైనా ఇంత పెద్ద మొత్తంలో సూసైడ్ డ్రోన్‌లను ఎందుకు కొనుగోలు చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేప‌థ్యంలో తైవాన్ కూడా అతిపెద్ద ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని, భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, భారతదేశం ఇప్పటికే ‘నాగాస్త్ర’ అని పిలిపే బ‌ల‌మైన‌ స్వదేశీ డ్రోన్ వ్యవస్థను కలిగి ఉంది.

చైనా మిలిటరీకి మేజర్ బూస్ట్

ఒక చైనీస్ డ్రోన్ త‌యారీ సంస్థ‌ 2026 నాటికి ఒక మిలియన్ కామికేజ్ డ్రోన్‌ (Kamikaze Drone)ల ను తయారు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నిపుణులు దీనిని చైనా ప్రధాన వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు, ఆధునిక యుద్ధంలో దాని దూరదృష్టిని తెలియ‌జేస్తుంది. ఈ సుసైడ్ డ్రోన్‌లు యుద్దభూమి వ్యూహాలను విప్లవాత్మకంగా మార్చే అవకాశం ఉంది. PLA కోసం ఒక కొత్త శకానికి గుర్తుగా ఉంటుంది.

కామికేజ్ డ్రోన్‌లు ఎందుకు ప్రత్యేకమైనవి?

కమికేజ్ డ్రోన్‌లు (china Kamikaze Drone), లాటరింగ్ మందుగుండు సామగ్రి అని కూడా పిలుస్తారు, ఖచ్చితమైన ఆత్మాహుతి దాడుల కోసం వీటిని రూపొందించారు. ఇవి శత్రు ప్రాంతాలపై తిరుగుతూ తమ లక్ష్యాలను గుర్తించి, అక్కడ వాలిపోయి తమను తాము పేల్చుకుంటాయి. దీని వలన భారీగా ఆస్తి, లేదా ప్రాణ‌ నష్టం సంభ‌వించ‌వ‌చ్చు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇతర మధ్యప్రాచ్య సంఘర్షణల సమయంలో ఈ డ్రోన్‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి.

‘కామికేజ్’ పేరు ఎలా వచ్చింది?

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పైలట్లు ‘కామికేజ్’ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పైలట్లు ఆత్మాహుతి మిషన్లు నిర్వహించేవారు. ఈ డ్రోన్‌లు ఖచ్చితత్వంతో ఆస్తులను లక్ష్యంగా చేసుకుని పేలిపోతాయి. ఈ డ్రోన్‌ల కాంపాక్ట్ సైజు, శత్రు ప్రాంతాలపై సంచరించే సామర్థ్యం వాటిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి.

భార‌త్ నుంచి నాగాస్త్ర-1 (Nagastra-1)

ఆత్మాహుతి డ్రోన్‌లతో చైనా ఉద్దేశాలు అస్పష్టంగా ఉన్నందున, భారతదేశం ఇప్పటికే తన స్వదేశీ లాటరింగ్ మందుగుండు సామగ్రిని నాగాస్త్ర-1ని మోహరించింది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ ద్వారా అభివృద్ధి చేసిన , నాగాస్త్ర-1 (Nagastra-1) రక్షణ, మందుగుండు సామగ్రి వ్యవస్థలలో స్వావలంబన దిశగా ఒక ప్రధాన అడుగుగా చెప్ప‌వ‌చ్చు. .

ఇది కమికేజ్ మోడ్‌లో GPS-నావిగేష‌న్‌తో ఖ‌చ్చిత‌మైన ల‌క్ష్యాల‌ను గురిపెడుతుంది.ఇది 4,500 మీటర్ల ఎత్తుకు చేరుకోగలదు. అంతే కాదు, నాగాస్ట్రా-1 రాడార్-రెసిస్టెంట్, రిమోట్‌గా నియంత్రించబడుతుంది.
నాగాస్త్ర-1 అన్ని లక్షణాలు సర్జికల్ స్ట్రైక్స్‌కు అనువైనవిగా చేస్తాయి,


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here