Home Elections Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

0
4
Bihar Elections 2025 :
Spread the love

Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్‌లతో ఈ కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం దిశ‌గా దూసుకుపోతోంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది కూటమికి అత్యుత్తమ ప్రదర్శన, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి 206 రికార్డును బ‌ద్ద‌లుక కొట్టేలా క‌నిపించింది.

రాష్ట్రంలో మహాఘట్బంధన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని కూటమి కేవలం 28 సీట్లకే పరిమితమైంది.

2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రెండు దశల్లో పోలింగ్ జ‌రిగింది. మొదటి దశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న జరిగింది. ఈ సంవత్సరం ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 65.08 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రెండవ దశలో 69.20 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 67.13 శాతంగా నమోదయ్యారు, ఇది బీహార్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికం.

మహాఘట్బంధన్ ఘోర ప‌రాజ‌యం

బీహార్‌లో మహాకూటమి ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ముఖేష్ సహానీకి చెందిన వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ఖాతాలు తెరవలేదు.

వామపక్ష భాగస్వాములలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వరుసగా రెండు, రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ జాన్ సురాజ్ పార్టీ బోనీ కొట్ట‌లేదు.

నేడు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు, అక్కడ ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయం పట్ల బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ ప్రశంసలు కురిపించారు, బీహార్ ప్రజలు “ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడీ”పై నమ్మకం ఉంచారని ఆయన అన్నారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here