vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..
vande bharat sleeper train : భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొస్తోంది. ఈ రైలు కొత్త డిజైన్తో తయారీకి సిద్ధంగా ఉందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. వందే భారత్ స్లీపర్ కోచ్ల కొత్త డిజైన్ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తాయి. కాగా కొత్తగా రూపొందించిన స్లీపర్ కోచ్లతో కూడిన మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అవి రాత్రిపూట ఈ హై-స్పీడ్ రైళ్లు ఎక్కువ దూరం ఉన్న గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి అనువుగా ఉంటాయి. అత్యాధునిక హైటెక్ ఫీచర్లతో ఆకర్షణీయమైన లుక్ తో స్వదేశీ సెమీ-లైట్ స్పీడ్ రైలు ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. అధిక వేగం, మెరుగైన భద్రత, మంచి సర్వీస్ కారణంగా వందేభారత్...