ఇస్రో కౌంట్డౌన్ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..
గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత
చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్డౌన్ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు. శనివారం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఆమె చివరిసారిగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు.
జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు.తమిళనాడులోని అరియలూర్కు చెందిన వలర్మతి శనివారం సాయంత్రం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. జూలై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్డౌన్గా నిలిచింది. .ISRO scientist Valarmathi మృతికి ISRO మాజీ డైరెక్టర్ డాక్టర్ PV వెంకటకృష్ణన్ X (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. “శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్ల కౌంట్డౌన్లకు వలర్మతి మేడమ్ వ...