
Lok Sabha elections | లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..
Lok Sabha elections | లోక్ సభ తొలిదశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.ఈ నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. బీహార్ మినహా మొదటి విడత లోక్సభ ఎన్నికలు జరిగే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నామినేషన్ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం కల్పించారు. బీహార్లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్లను సమర్పించేందుకు వెసులుబాటు ఇచ్చారు.20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 28న నామినేషన్లకు సంబంధించి స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్లో మార్చి 30న నామినేషన్ల స్క్రూటినీ జరరుతుంది. బీహార్ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్ల విత్ డ్రా కు తుదిగడువు విధించారు. బీహార్లో మాత్రం నామినేషన్ల ...