Friday, August 1Thank you for visiting

Tag: telangana news

Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?

Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?

Telangana
Mahalaxmi Scheme Subsidy Gas Cylinder : తెలంగాణ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇటీవ‌లే రూ.500ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్ప‌టికే అర్హుల జాబితాను కూడా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పథకానికి అర్హులైన వారి మూడు సంవ‌త్స‌రాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏడాదికి ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. అయితే ఈ పథకానికి మొద‌ట‌ 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్‌ ‌సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే...
Telangana Budget | కౌలు రైతులకు త్వరలో రుణమాఫీ,  ఉచిత కరెంట్ పథకానికి నిధుల కేటాయింపు..

Telangana Budget | కౌలు రైతులకు త్వరలో రుణమాఫీ, ఉచిత కరెంట్ పథకానికి నిధుల కేటాయింపు..

Telangana
Telangana Budget |  2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఈ సదర్భంగా రాష్ట్రంలోని  కౌలు రైతులకు డిప్యూటీ సీఎం  గుడ్ న్యూస్ చెప్పారు.  రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని  ప్రకటించారు. ఏడాదికి ఒక ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు. ఈ రోజు  అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి  మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం  ద్వారా ఎక్కువగా అనర్హులే లబ్ధి పొందారన్నారు.  పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారని విమర్శించారు.  రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి ఇకపై అర్హులైనవారికే రైతు బంధు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. గృహ‌జ్యోతి ప‌థ‌...
Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?

Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?

Special Stories
Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి..ఆలయ చరిత్ర ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూ...
TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్..  ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..

TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు.  అయితే పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది.  దీం...
Prajapalana Application | ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం.. అప్లై చేసుకునే విధానం ఇదే..

Prajapalana Application | ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం.. అప్లై చేసుకునే విధానం ఇదే..

Telangana
ప్రజాపాలన' దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లో 'ప్రజాపాలన'(Prajapalana) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీల కోసం ప్రజల వద్దకే వెళ్లి దరఖా స్తులు స్వీకరిస్తున్నామని, అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు విధానం ఇదే..Prajapalana Application Process : 'ప్రజాపాలన' దరఖాస్తు పత్రాన్ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిం ది. ఇందులో 4 పేజీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అర్హులు ప్రతీ పథ...
New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana
TS New Ration Cards : తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. రేపటి నుంచి జనవరి 6 వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు.. దీనికి సంబంధించి సచివాలయంలో ‘ప్రజాపాలన’ లోగో, దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు బుధవారం ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏం చెప్పారు..? కొత్త రేషన్ కార్డుల మంజూరు (New Ration Cards)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల ఫాంలను తీసుకు...
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు

Telangana
panchayat elections 2024 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ ముగిసింది. ఆ హడావిడి నుంచి తేరుకోకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీకాలం వచ్చే సంవత్సరం జనవరి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు చేరవేశారు.దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను సైతం ప్రారంభించింది.  న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి కాగా తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయ...
BJP | తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగాయి.. షాకిచ్చిన అగ్రనేతల ఓటమి

BJP | తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగాయి.. షాకిచ్చిన అగ్రనేతల ఓటమి

Telangana
Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని ఫలితాలు వచ్చాయి. పార్టీకి ప్రధాన బలంగా భావించిన అగ్రనేతలు ఓటమి పాలు కావడం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలుస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారు మాత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి 8 స్థానాలు ప్రజలకు కట్టబెట్టిన కీలకమైన అగ్రనేతలను నేతలు ఓడిపోవడం మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. బండి సంజయ్‌ ఓటమి పెద్ద షాక్.. తెలంగాణ మొత్తం బీజేపీకి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి నేతగా బండి సంజయ్‌కి పేరుంది. పార్టీ అధ్యక్షుడిగా పార్టీని అగ్రపథాన నిలబెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. తెలంగాణలో బలమైన బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన్ని అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ...
TS Mlas Assets: తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు.. ఎమ్మెల్యేల ఆస్తులు ఇవీ..

TS Mlas Assets: తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు.. ఎమ్మెల్యేల ఆస్తులు ఇవీ..

Trending News
TS Mlas Assets: తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.TS Mlas Assets : తెలంగాణలోని మొత్తం 119 శాసన సభ్యుల్లో 90 శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ADR) సంస్థ పేర్కొంది. బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు, అలాగే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ(BJP) ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్ (ADR) సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్ ను బట్టి తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీలపరంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి సు...
Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Crime
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఘటన..! Hanumakonda | కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ కానిస్టేబుల్‌ అత్తను రివాల్వర్ తో కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా, నిందితుడిని ప్రసాద్ గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రసాద్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్‌ భార్యతో కలిసి ఇటీవల  Hanumakonda గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు. డబ్బుల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తలక...