Hyderabad Lok Sabha elections | హైదరాబాద్లో 5.41 లక్షల మంది నకిలీ ఓటర్లను తొలగించిన ఎన్నికల సంఘం
Hyderabad Lok Sabha elections 2024: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీ ఓట్లతో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది.తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్లో మే 13న నాలుగో విడలతో ఓటింగ్ జరగనుంది. ఏఐఎంఐఎం కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ లోక్ సభ స్థానంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ సీట్ గా నిలిచింది. .అయితే ఓట్ల తొలగింపుపై జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితా స్వచ్ఛతకు కృషిచేస్తోందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ECI నిబంధనలకు కట్టు...