Tiranga Yatra | తిరంగా యాత్రను విజయవతం చేయండి
కేంద్రమంత్రి కిషన్రెడ్డి పిలుపుTiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైన నేపథ్యంలో మన వీరజవాన్లకు మద్దతు తెలుపుతూ శనివారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్ర (Tiranga Yatra )ను విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన పహల్గామ్ ఘటనకు కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశారని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప...