
Amit shah on POK | పీవోకేలో ప్రతీ అంగుళం భారత్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన
Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. కాగా పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మనం గౌరవించాలని మణిశంకర్ అయ్యర్ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూటమి నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై అమిత్ షా స్పందిస్తూ నేను కాంగ్రెస్, భారత కూటమికి చెప్పాలనుకుంటున్నాను పీఓకే భారత్కు చెందినది, దానిని ఏ శక్తీ లాక్కోలేదు’’ అని జార్ఖండ్లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు.కాంగ్రెస్పై విరుచుకుపడిన ఆయన, “కాంగ్రెస్కు ఏమైందో నాకు తెలియదు. పీఓకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కానీ మీరు (కాం...