Posted in

Railways News | 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

SCR Special Trains
Indian Railways update
Spread the love

Railways News | సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు రైల్వే బోర్డు వివిధ జోన్లలో 25,000 ఖాళీ పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయాల‌ని రైల్వేశాఖ భావిస్తోంది.

ఈ స్కీమ్ కింద, రిటైర్డ్ సిబ్బంది 65 ఏళ్లలోపు ఉన్నంత వరకు, సూపర్‌వైజర్‌ల నుంచి ట్రాక్ మెన్ ల వరకు విధులు నిర్వ‌ర్తించ‌డానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాల నుంచి మెడికల్ ఫిట్‌నెస్, పనితీరు రేటింగ్‌లు వంటి ప్రమాణాల ఆధారంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకోవడానికి అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు అధికారం ఉంది.

నిబంధ‌న‌ల ప్రకారం.. దరఖాస్తుదారులు పదవీ విరమణకు ముందు వారి ఐదేళ్ల స‌ర్వీస్ రికార్డులో మంచి గ్రేడింగ్ కలిగి ఉండాలి. వారిపై ఎటువంటి విజిలెన్స్ లేదా డిపార్ట్‌మెంటల్ యాక్షన్ కేసులు ఉండకూడదు.

రెండో సారి నియామ‌క‌మైన ఉద్యోగులు వారి బేసిక్ పెన్షన్‌ను తీసివేసి వారి చివరిగా తీసుకున్న జీతానికి సమానమైన నెలవారీ వేత‌నాలు అందుకుంటారు. వారు రాకపోకలు, అధికారిక పర్యటనలకు ప్రయాణ భత్యాలకు కూడా అర్హులు, కానీ అదనపు ప్రయోజనాలు లేదా ఇంక్రిమెంట్లు ఉండ‌వు.

పెరుగుతున్న రైలు ప్రమాదాలు, శ్రామిక శక్తి తగ్గిపోతున్న నేపథ్యంలో రైల్వే శాఖ‌ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నార్త్-వెస్ట్రన్ రైల్వేలో 10,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, తక్కువ సిబ్బంది కారణంగా రైల్వేలు అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంది. నిఘా, రైల్వే ట్రాక్ ల ప‌ర్య‌వేక్ష‌ణ వంటి కీల‌క విధుల్లో సిబ్బంది ఒత్తిడి త‌గ్గించ‌డానికి రైల్వే బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *