Manipur chargesheet : మణిపూర్ ఘటనపై సీబీఐ చార్జిషీట్ ఏడాది తర్వాత వెలుగులోకి షాకింగ్ నిజాలు
Manipur chargesheet | యావత్ దేశాన్ని కలిచివేసిన మణిపూర్ దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి దాదాపు ఏడాది తర్వాత, ఇప్పుడు మరిన్ని కలతపెట్టే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమర్పించిన ఛార్జిషీట్ను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మంగళవారం నివేదించింది,
దాదాపు వెయ్యి మంది పురుషుల గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే ముందు మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో కుకీ-జోమీ కమ్యూనిటీకి చెందిన వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు, ఇద్దరు బాధితురాళ్లు రోడ్డు పక్కన ఆగి ఉన్న “పోలీసు జిప్సీ లోపలికి వచ్చి కూర్చోగలిగారు”, మమ్మల్ని రక్షించండి వెంటనే వాహనాన్ని స్టార్ట్ చేయండి అని బాధితులు పోలీసులన ప్రాథేయపడ్డారు. అపుడు పోలీసు డ్రైవర్ జీపు “కీ లేదు” అని వారికి బదులిచ్చాడు అని సిబిఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. పోలీసు జిప్సీలో మరో ఇద్దరు మగ బాధితులు కూడా కూర్చున్నారు. దీంతో పెద్ద గుంపు వాహనం వద్దకు వచ్చి జిప్సీ నుంచి బాధితులను బయటకు లాగడంతో పోలీసులందరూ అక్కడి నుండి వెళ్లిపోయారని చార్జిషీట్ పేర్కొంది.
మే 3న చురచంద్పూర్లో హింసాత్మక ఘటన జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి అక్టోబరులో గౌహతిలోని ప్రత్యేక కోర్టులో ఆరుగురు నిందితులతోపాటు, ఒక మైనర్ పై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈఘటనకు సంబంధించిన వైరల్ వీడియో జూలై 2023లో వైరల్గా మారి దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల్ని రగిల్చింది. సుమారు వెయ్యి మందితో కూడిన పురుషుల గుంపు ఇద్దరు మహిళలను (ఒకరు 20 ఏళ్లు, మరొకరు 40 ఏళ్లు) మైదానం వైపు నగ్నంగా ఊరేగించారు. కొందరు పురుషులు ఇద్దరు మహిళలను ఈడ్చుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వీడియో ఫుటేజీ చూపించింది.
“ఈ ఘటన తర్వాత ఇతర ప్రదేశాలలో అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. Meitei కమ్యూనిటీకి చెందిన గుంపు ఒక గ్రామంలో ఇళ్లకు నిప్పంటించింది. పొరుగు గ్రామాల్లోని కొన్ని నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుంపు చర్చికి నిప్పు పెట్టింది. మే 4న చుట్టుపక్కల మెయిటీ గ్రామాల పెద్దలు, ఇతర కమ్యూనిటీ గ్రామాల ముఖ్యుల సమావేశం నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే, సమావేశం తర్వాత గుంపు చర్చి, కొన్ని ఇళ్లు, సమీప గ్రామాలను తగలబెట్టింది” అని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది.
“భయంతో, ఫిర్యాదుదారుడు, ముగ్గురు బాధితులు, ఇద్దరు పురుషులు, మరొక వ్యక్తి తన కుమార్తె, ఒక మనవడితో కలిసి అడవిలోకి పారిపోయారని దర్యాప్తులో తేలింది. ఒక కుటుంబంలోని సభ్యులు దాక్కున్న ప్రదేశాన్ని గుంపు గమనించి, వారిని చూడగానే ‘ఇక్కడ దాక్కున్నారు’ అని అరవడం ప్రారంభించారు. చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకున్న గుంపు సభ్యులు వారి వద్దకు దూసుకెళ్లి, ‘చురాచంద్పూర్లో మీరు మాతో (మీతీ ప్రజలు) ఎలా ప్రవర్తించారో మేము మీకు కూడా అదే పని చేస్తాము’ అని బెదిరించారు. ఆ గుంపు కుటుంబ సభ్యులందరినీ బలవంతంగా ప్రధాన రహదారిపైకి తీసుకువచ్చి, బాధితుల్లో ఒకరిని ఆమె మనవరాలిని మరో వైపునకు తీసుకువెళ్లింది . ఇద్దరు మహిళలు, వారి తండ్రి, వారి గ్రామ పెద్ద మరో దిశలో తీసుకెళ్లారు. అని సీబీఐ పేర్కొంది.
ఆ గుంపులోని కొందరు వ్యక్తులు గ్రామం రోడ్డు పక్కన ఆగి ఉన్న పోలీసు జిప్సీని ఆశ్రయించాలని బాధితులకు చెప్పారని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది.
“పోలీసు జిప్సీని సమీపిస్తున్నప్పుడు, పురుషుల గుంపు మళ్లీ బాధితులను అడ్డుకుంది. ఇద్దరు (మహిళలు) బాధితులు పోలీసు జిప్సీలోకి ప్రవేశించగలిగారు. సాదా ఖాకీ యూనిఫారం ధరించిన డ్రైవర్తో పాటు ఇద్దరు పోలీసులు, పోలీసు జిప్సీలో వారితో పాటు, ముగ్గురు నుంచి నలుగురు పోలీసులు బయట ఉన్నారు. ఒక మగ బాధితుడు వాహనాన్ని స్టార్ట్ చేయమని పోలీసులను అభ్యర్థించాడు, అయితే పోలీసు జిప్సీ డ్రైవర్, ‘కీ లేదు’ అని బదులిచ్చారు. తమకు సహాయం చేయాలని, దాడికి గురవుతున్న వ్యక్తిని రక్షించాలని వారు పదే పదే పోలీసులను వేడుకుంటూనే ఉన్నారు, కానీ ‘పోలీసులు వారికి సహాయం చేయలేదు’ అని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది.
Manipur History: మణిపూర్ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?
“జిప్సీ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనం నడిపి దాదాపు 1,000 మంది ఉన్న హింసాత్మక గుంపు సమీపంలో వాహనాన్ని ఆపాడు, బాధితుడు మళ్లీ వాహనాన్ని స్టార్ట్ చేయమని పోలీసులను అభ్యర్థించాడు, అయితే అతను మౌనంగా ఉండమని సూచించాడు. బాధితుడు తన తండ్రిని కొట్టి చంపాడని బాధిత మహిళతో చెప్పాడు” అని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది. పెద్ద గుంపు పోలీసు జిప్సీ వైపు వచ్చారని సీబీఐ విచారణలో తేలింది. “వారు జిప్సీ లోపల నుంచి ఒక మగ బాధితుడిని, ఇద్దరు మహిళలను బయటకు లాగారు. ఇంతలో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయి, దుండగులతో బాధితులను ఒంటరిగా వదిలేశారు. వారు ఇద్దరు మహిళల దుస్తులను చింపి, మగ బాధితుడిని కొట్టడం ప్రారంభించారు ”అని సిబిఐ తెలిపింది.