Home National Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా...

Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌

0
10
Heatwave Alert
Spread the love

Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భార‌త‌దేశంలో కొనసాగుతున్న హీట్‌వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. ఉత్తర , మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వ‌డ‌గాల్పులు వీచే చాన్స్ ఉంద‌ని ఐఎండీ తెలిపింది. IMD తాజా వాతావరణ సూచన ప్రకారం, హీట్‌వేవ్ పరిస్థితులు తూర్పు భారతదేశంలో మే 5 వరకు దక్షిణ భారతదేశంలో మే 6 వరకు కొనసాగుతాయని , ఆ తర్వాత అవి తగ్గుతాయని వెల్ల‌డించింది. అయితే మే 5, 6 తేదీలలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది.

పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ‌డ‌గాల్పులు

Heatwave Alert తూర్పు దక్షిణ ద‌క్షిణ‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. కనీసం 13 ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొన్నాయి.

IMD డేటా ప్రకారం, ఈ ఏప్రిల్‌లో హీట్‌వేవ్‌లు 2023 కంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు రికార్డ్‌లో ఉన్న తీవ్ర‌మైన ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన సంవత్సరం. గ‌త‌ ఏప్రిల్‌లో తూర్పు, ఈశాన్య. దక్షిణ భారతదేశంలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ‌లు దంచికొట్ట‌డంతో పాఠశాలల్లో తరగతులు కూడా నిలివేసిన విష‌యం తెలిసిందే.. ఇదే ట్రెండ్ మే నెల‌లోనూ కొన‌సాగ‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో దాదాపు ఎనిమిది నుండి 11 రోజుల వరకు వేడిగాలులు ఉండే అవకాశం ఉంది.

రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఇంటీరియర్ ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో ఐదు నుంచి ఏడు ప‌ర్యాయాలు హీట్ వేవ్ ఉండ‌నున్న‌ట్లు ఐఎండీ తెలిపింది.

ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు

ఇదిలా ఉండ‌గా దిమా హసావో కొండ జిల్లాలో భారీ వర్షపాతం వరదలు సంభ‌వించ‌డంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్ర‌జా ర‌వాణాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా హాఫ్లాంగ్ టౌన్‌తో సహా జిల్లాలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. జటింగ-లంపూర్, న్యూ హరంగాజావో మధ్య కొండచరియలు విరిగిపడటంతో రైల్వే సేవలు కూడా దెబ్బతిన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 5, 6వ‌ తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మే 5 న సిక్కింలో ఒంటరిగా భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here