Home » Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు
Hyderabad Flights

Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు

Spread the love

RGIA నుంచి ఏడు కొత్త డైరెక్ట్ విమానాలు ప్రారంభం

Hyderabad Flights | విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న హైద‌రాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది. ఈ విమాన స‌ర్వీసులు సోమ, బుధ, శుక్రవారాలు, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. జూన్ 1న హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను స్పైస్‌జెట్ నిలిపివేసింది. ఈ క్ర‌మంలో మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి యూపీలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు తన డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. ఎయిర్‌లైన్స్ సెప్టెంబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఏడు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది . RGIA నుంచి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ న‌గ‌రాల‌కు కలుపుతాయి.

READ MORE  Karimnagar Hasanparthy Railwayline | గుడ్ న్యూస్‌.. కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ పై కీలక అప్ డేట్..

విమానయాన సంస్థ సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు అయోధ్యకు విమానాలను నడపనుంది. జూన్ 1న స్పైస్‌జెట్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్-రాజ్‌కోట్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సెప్టెంబర్ 16న ప్రారంభం కాగా, హైదరాబాద్-అగర్తల మధ్య వారానికి 4 రోజుల సర్వీస్ సెప్టెంబర్ 23న ప్రారంభించింది. అలాగే హైదరాబాద్-జమ్మూ మధ్య వారానికి 3 రోజుల సర్వీసు సెప్టెంబర్ 24న ప్రారంభమైంది.

READ MORE  Modernization of ITI's | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

హ‌ర్షం వ్య‌క్తం చేసిన కిష‌న్ రెడ్డి

Hyderabad Flights హైదరాబాద్ నగరం నుంచి నెల రోజుల్లో 7 కొత్త సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రయాణికులు వివిధ సాంస్కృతిక గమ్యస్థానాలను అన్వేషించడం సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఈ కొత్త సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేర్చగలవని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

READ MORE  Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..