Tuesday, May 20Welcome to Vandebhaarath

జనవరి 2024 వరకు రామ మందిరం పక్కనే అయోధ్య విమానాశ్రయం సిద్ధం

Spread the love

అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం జనవరి 2024 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడుతుంది మరియు అదే సమయంలో రామ మందిరంతో పాటు నిర్మాణం పూర్తవుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Temple) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆలయం పక్కనే పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం (Maryada Purushottam Shri Ram Airport )పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాగా మొదటి కమర్షియల్ విమాన కార్యకలాపాలు జనవరి 2024లో ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. “ఇదే సమయంతో పోటాపోటీగా రామ మందిర నిర్మాణంతో పాటు విమానాశ్రయం కూడా పూర్తవుతుంది” అని ఒక అధికారి చెప్పారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారుల ప్రకారం.. మొదటి దశలో అయోధ్య విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలు, 2245 మీటర్ల పొడవు గల రన్‌వే అభివృద్ధి, డాప్లర్ వెరీ హై-ఫ్రీక్వెన్సీ ఓమ్నీ రేంజ్ (DVOR) అలాగే హోమింగ్ గేట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం చేపట్టనున్నారు.

రెండో దశలో అంతర్జాతీయ కార్యకలాపాలు

రెండో దశలో, అయోధ్య అంతర్జాతీయ వాణిజ్య విమాన కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. ఈ దశలో అంతర్జాతీయ ఆపరేషన్ కోసం రన్‌వే 3,125 మీటర్ల వరకు విస్తరించనున్నారు. రెండో టెర్మినల్ 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. విమానాశ్రయం మొత్తం 821 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Ayodhya Airport లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆప్రాన్, ట్యాక్సీవే, ఐసోలేషన్ ఏరియాతో పాటు టెర్మినల్-1 నిర్మాణ పనులు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. విమానాశ్రయం గంటకు 500 మంది ప్రయాణికులను మేనేజ్ చేయగల సామర్థ్యం ఉంది. ఒకేసారి ఎనిమిది ఎయిర్‌బస్ A-320 విమానాలను కలిగి ఉంటుంది.

“అన్ని గ్రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ కాలిబ్రేషన్ పూర్తయింది. రామ మందిరం నిర్మాణంతో పాటు విమానాశ్రయం కూడా పూర్తవుతుందని, ఆ తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వాణిజ్య కార్యకలాపాలకు లైసెన్స్ ఇస్తుంది” అని అయోధ్య విమానాశ్రయం AAI ఇంజనీరింగ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ కులశ్రేష్ఠ చెప్పారు.
2024 మొదటి త్రైమాసికం నాటికి అయోధ్య విమానాశ్రయం నుంచి కోల్‌కతా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు కనెక్టివిటీ ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం ప్రాజెక్టు మొదటి దశ వ్యయం రూ.323 కోట్లు. విమానాశ్రయం ఎంట్రీ, ఎగ్జిట్ కోసం నాలుగు లేన్‌లను కలిగి ఉంటుంది.. అవి నేరుగా సుల్తాన్‌పూర్ రహదారితో అనుసంధానించబడతాయి. AAI ప్రకారం, దేశీయ విమానాశ్రయ టెర్మినల్ రూపకల్పన రాముడి జీవితంలోని వివిధ దశలను వర్ణించేలా రూపొందిస్తున్నారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి ఆధ్యాత్మికత భావనను కలిగిస్తుంది. ఎయిర్‌పోర్టు విద్యుత్‌ను సమర్థంగా చేసేందుకు వాహనాల పార్కింగ్ ప్రాంతం పక్కనే సోలార్ ప్యానెల్స్ ఉంటాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో అలాగే WhatsApp  చానల్ లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..