Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..

Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..

Telangana
హైదరాబాద్: విద్యుత్ వినియోగ‌దారుల‌కు టీజీఎస్‌పీడీసీఎల్ కీల‌క సూచ‌న‌లు చేసింది. క‌రెంటు బిల్లులు చెల్లించేవారు ఆర్‌బిఐ ఆదేశాల మేర‌కు ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే ద్వారా క‌రెంటు బిల్లుల చెల్లింపుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.Current Bill Payment | తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ బిల్లులను బ్యాంకులు నిలిపివేయడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించ‌డం సాధ్య‌ప‌డ‌దు.అయితే, విద్యుత్ వినియోగ‌దారులు తమ క‌రెంటు బిల్లులను TGSPDCL వెబ్‌సైట్, లేదా దాని మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. TGSPDCL అధికారిక 'X' హ్యాండిల్ ద్వారా ఈ విష‌యాన్ని ప్రకటించింది. అలాగే వినియోగదారులు తమ బిల్లులను కంపెనీ బిల్లుల చెల్లింపు కేంద్రాల ద్వారా కూడా చెల్లించవచ్చు. ...
Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..

Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..

Telangana
హైదరాబాద్ : హైద‌రాబాద్‌ పాతబస్తీ (Hyderabad Old City) లో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూఢిల్లీలో ఇటీవ‌ల విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్‌గా, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. సేకరించిన మొత్తంలో 75% రాష్ట్ర ఖజానాకు, మిగిలిన 25% అదానీకి వస్తాయని రేవంత్ వెల్ల‌డించారు. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అదానీ గ్రూపు ఆమోదం తెలిపింద‌ని, కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. బిల్లుల వసూలంటే ముచ్చమటలే.. కాగా హైద‌రాబాద్ పాత బ‌స్తీలో విద్యుత్ బిల్లుల వ‌సూలు ప్ర‌క్రియ అత్యంత స‌వాల్ తో కూడుకున్న‌ది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్‌ సిబ్బందిపై దాడులు చేయడం వం...
Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..

Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..

Telangana
Warangal Ring Road | ద‌శాబ్డాలుగా ఎదురుచూస్తున్న వ‌రంగ‌ల్ రింగ్‌రోడ్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి వెంట‌నే మాస్టర్‌ ప్లాన్‌-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు (Warangal Ring Road) కోసం భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ప్రతిపాదిత ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ను...
TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

Telangana
TGSRTC Digital Tickets : తెలంగాణ ఆర్టీసీ బ‌స్ టికెట్ల జారీ విష‌యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సిటిజన్ ఫ్రెండ్లీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) త్వరలో డిజిటల్‌గా మారనుంది.డిజిటల్ టికెట్ల విష‌యంలో గతంలో పైలట్ రన్ చేప‌ట్ట‌గా  అపూర్వ స్పందన వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) సాఫ్ట్‌వేర్‌తో కూడిన i-TIMS (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మెషిన్)ని అన్ని రకాల బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఈ టెక్నాల‌జీ సాయంతో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్యూఆర్ కోడ్, యూపీఐ సాయంతో అత్యంత సులభంగా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఆర్టీసీ ప‌రిధిలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌ TGSRTC ఫ్లీట్ అంతటా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని బం...
Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..

Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..

Telangana
Rythu Runa Mafi | గ‌త ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్ర‌క్రియను ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్ర‌వారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామ‌ని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ ‌కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమ‌ని తేల్చి చెప్పారు. కేవ‌లం ప‌ట్టా పాస్‌ ‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై ఆస‌క్తిక‌...
Rythu runa Mafi | రైతుల‌కు శుభ‌వార్త‌.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు..

Rythu runa Mafi | రైతుల‌కు శుభ‌వార్త‌.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు..

Telangana
Rythu runa Mafi | రుణ మాఫీ కోసం ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. దీంతో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. అయితే ఇటీవ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ‌స్టు 15 లోపు రుణ‌మాఫీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా ఉప‌ముఖ్య‌మ‌త్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti Vikramarka ) రుణ‌మాఫీ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ 2 లక్షల రైతు రుణమాఫీ (Rythu runa Mafi )  ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామని ఈ ప‌థ‌కాన్ని ఎవరూ అడ్డుకోలేర‌ని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా అమ‌లుపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని రైతు భ‌రోసా ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి? అన్నది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామ‌ని, విధివిధానాల...
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

Telangana
New National Highways | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మాకాం వేసి వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి ప్ర‌తిపాద‌న‌ల‌ గురించి ఆయా శాఖ‌ల మంత్రుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఈమేర‌కు బుధ‌వారం కేంద్ర ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిశారు. ఈసంద‌ర్భంగా తెలంగాణ‌లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను కేంద్ర మంత్రికి ముందుంచారు.రీజిన‌ల్ రింగు రోడ్డు ( RRR) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు లైన్ల ర‌హ‌దారిగా విస్త‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గ‌జ్వేల్‌-జ‌గ‌దేవ్‌పూర్‌-భువ‌న‌గిరి-చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జా...
New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

Telangana
Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్  నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం  చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు. గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు.. ఈ కొత్త రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to...
Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు  రైళ్ల వివరాలు ఇవే..

Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైళ్ల వివరాలు ఇవే..

Telangana
Railway News | హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్ (Kazipet Ballarsha Section) లో   ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు మ‌రికొన్నింటిని దారిమ‌ళ్లించ‌నున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను దారి మళ్లించి నడపించ‌నున్నారు. ఈ వివరాలను దక్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ఒక‌ ప్రకటనలో పేర్కొంది. యి. Cancellation  Of Trains  (రద్దయిన రైళ్ల వివ‌రాలు)జూన్ 26 నుంచి జులై 6 వ‌ర‌కు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ న‌గ‌ర్ మ‌ధ్య న‌డిచే గే కాగజ్ న‌గ‌ర్‌ గర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు (12757/12758) రద్దయ్యాయి. ఈ నెల 28, జులై 5న పుణె-కాజీపేట ఎక్స్ ప్రెస్ (22151) జూన్ 30, జులై 3న కాజీపేట-పుణె ఎక్స్ప్రెస్ (22152) జూన్ 28న, హైదరాబాద్...
Rythu Bharosa | అన్నదాతలకు గుడ్ న్యూస్..  రైతు భరోసాపై తెలంగాణ స‌ర్కారు కీలక నిర్ణయం

Rythu Bharosa | అన్నదాతలకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై తెలంగాణ స‌ర్కారు కీలక నిర్ణయం

Telangana
Rythu Bharosa | రైతు భరోసాపై తెలంగాణ స‌ర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్‌, ‌చేనేత, జౌళి శాఖల అధికారులతో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్‌ ‌చేనేత జౌలి శాఖల అధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఇందులో వార్షిక బ్జడెట్‌ ‌ప్రతిపాదనలపై చ‌ర్చ‌లు జ‌రిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ రఘునందన్‌ ‌రావు తదితరులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. వార్షిక బడ్జెట్‌ ‌ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రైతు భ‌రోసా అమ‌లు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్...