TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
TG Rain Alert | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి సమీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్రయాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది.ఈ క్రమంలో రానున్న రెండురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ను...