పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ పాక్లో గుర్తు తెలియని దుండగుల చేతిలో హతం..
2016 పఠాన్కోట్ (Pathankot ) ఉగ్రదాడి సూత్రధారి, కీలక సూత్రదారి లతీఫ్ను బుధవారం పాకిస్థాన్(Pakistan ) లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.పఠాన్కోట్(Pathankot) దాడికి సూత్రధారి, భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్(Shahid Latif) ను బుధవారం పాకిస్థాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్కోట్ దాడికి ప్రధాన కుట్రదారు.అతను సియాల్కోట్ నుంచే దాడికి వ్యూహ రచన చేశాడు. దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్కోట్కు పంపాడు.చట్టవిరుద్ధమైన (కార్యకలాపాల) నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రవాద ఆరోపణలపై నవంబర్ 1994లో లతీఫ్ భారతదేశంలో అరెస్టు అయ్యాడు. విచారణ అనంతరం చివరికి జైలు పాలయ్యాడు. భారతదేశంలో శిక్ష అనుభవించిన తరువాత, అతను 20...