
EPFO Update | మీరు వచ్చే ఏడాది నుంచి నేరుగా ATMల నుంచి PFని విత్డ్రా చేసుకోవచ్చు
EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంవత్సరం నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్లను నేరుగా ATMల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా బుధవారం ఈ పెద్ద ప్రకటన చేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ.. "మేము క్లెయిమ్లను త్వరగా పరిష్కరిస్తున్నాం, చందాదారుల మెరుగైన, సత్వర సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాము. ఒక క్లెయిమ్దారు, లబ్ధిదారుడు లేదా బీమా చేయబడిన వ్యక్తి ATMల ద్వారా సౌకర్యవంతంగా తమ క్లెయిమ్లను పొందగలరు " అని లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా చెప్పారు.మేము ఈపీఎఫ్ లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తున్నామమని, ఈపీఎఫ్ క్లెయిమ్ల వేగం, ఆటో-సెటిల్మెంట్ పెరిగిందని, అనవసరమైన ప్రక్రియలను తొలగించామని తెలిపారు. మా EPFO లోని IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మన బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయికి తీసుకురా...