Operation Mahadev : క‌శ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది జిబ్రాన్ సహా ముగ్గురు హ‌తం

Operation Mahadev

Operation Mahadev | శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. హతమైన ఉగ్రవాదిని జిబ్రాన్‌గా గుర్తించారు. ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) కింద నిర్వహించిన ఈ ఎన్‌కౌంట‌ర్ లో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలలో కీలక వ్యక్తి అయిన జిబ్రాన్‌ను వారాల తరబడి జాగ్రత్తగా సమన్వయంతో చేప‌ట్టిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్లు వర్గాలు తెలిపాయి. సోమవారం దచిగామ్ …

Read more

Operation Keller : కొత్తగా జమ్మూ కశ్మీర్‌లో భారతఆర్మీ ప్రారంభించిన ‘ఆపరేషన్ కెల్లర్’ ఏమిటి?

Operation Keller

Operation Keller: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా, మంగళవారం (మే 13) షోపియన్ జిల్లాలోని దట్టమైన కెల్లర్ అటవీ ప్రాంతంలో జరిగిన హై-స్కేట్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులను హతమార్చింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు “ఆపరేషన్ కెల్లర్” అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ మిషన్ ప్రారంభించబడింది. ఖచ్చితమైన నిఘా సమాచారం అందడంతో వెంటనే చర్య తీసుకున్న …

Read more

BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

Vijay Diwas 2025

India’s BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని “యుద్ధ చర్య”గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి. భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) …

Read more

భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

Operation Sindoor

Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ‘Operation Sindoor’ కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. పాకిస్తాన్ (Pakistan), …

Read more

Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..

PM Modi Speech on Women's Bill

PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus water treaty) పై కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో భారతదేశంలోని నీరు బయటకు వెళ్లేది. కానీ ఇప్పుడు దానిని భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు భారతదేశానికి హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుంచి బయటకు వెళ్లిపోయేదని ఆయన …

Read more

Illegal immigrant : గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!

Immigrants

Ahmadabad : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ‌ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ‌నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్‌ ‌బ్రాంచ్‌ అధ్వర్యంలో క్షుణ్ణంగా అనువణువు సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విచారణ అనంతరం వారివారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్‌ – ‌బ్రాంచ్‌ …

Read more

Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు

Jammu Kashmir

Pahalgam Attack : శ్రీనగర్‌లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు), ఉగ్రవాదుల సహచరుల ఇళ్లపై విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదైన కేసుల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) తర్వాత కాశ్మీర్‌లోని అధికారులు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై భారీ …

Read more

Simla Agreement : పహల్గామ్ దాడి త‌ర్వాత పాక్ ర‌ద్దు చేసుకున్న సిమ్లా ఒప్పందం ఏమిటి?

India-Pakistan ceasefire

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతదేశం తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా, ఇస్లామిక్ దేశం 1972లో రెండు దేశాల మధ్య సంతకం చేసిన కీలక ఒప్పందాలలో ఒకటైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. 52 సంవత్సరాల క్రితం జూలై 2, 1972న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేసిన సిమ్లా ఒప్పందంలో ఆరు ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందంలోని …

Read more

Pahalgam Terror Attack : ఢిల్లీలో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Updates : పహల్గామ్‌లోని బైసరన్ లోయలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది హిందూ పర్యాటకులు మరణించారు. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన ఈ పాశవిక దాడితో కశ్మీర్ లోని ఒక సుందరమైన ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా చెదిరిపోయింది. సైనిక యూనిఫాం ధరించిన దాడి చేసిన వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో పర్యాటకులపై కాల్పులు జరిపారు, వీరిలో మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు బాధితుల …

Read more

Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి.. 27 మంది పర్యాటకులు మృతి

Jammu Kashmir

Pahalgam terror attack : జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చిన టూరిస్టులపై అత్యంత పాశవికగా దాడి చేశారు. ఈ ఘటనలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే. బైసారన్ మైదానంలో ఈ దాడి జరిగింది. …

Read more