
Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..
Karnataka Power Cuts | కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga district ) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు తన మొబైల్ ఫోన్లోని ఫ్లాష్లైట్ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. నివేదికలప్రకారం.. ఈ ప్రాంతం గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇందుకు ఆసుపత్రి కూడా దీనికి మినహాయింపు కాదు.'గృహజ్యోతి' (Gruha Jyoti) కింద ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే అధికార కాంగ్రెస్ పథకంపై బిజెపి 'Darkness Bhagya (చీకటి భాగ్య) అంటూ విమర్శించింది. సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరో 'గ్యారంటీ'గా బీజేపీ దీనిని 'చీకటి భాగ్య'గ...