Monday, July 7Welcome to Vandebhaarath

Tag: bengaluru

Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..
Crime

Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..

Minor girl kills father : మధ్యప్ర‌దేశ్ లో ఊహించ‌ని దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌త‌ మార్చి 15న జబల్‌పూర్‌ (Jabalpur) లోని మిలీనియం సొసైటీలో తన తండ్రి, తొమ్మిదేళ్ల సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల బాలికను  పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట హ‌త్య‌లు చేసిన అనంత‌రం తండ్రి, త‌మ్ముడి మృతదేహాలను ముక్క‌లుగా చేసి ఫ్రీజర్‌లో భద్రపరచడం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.పదో తరగతి చ‌దువుతున్నఈ టీనేజ్ బాలిక పోలీసుల‌కు పట్టుబడటానికి ముందు రెండు నెలలకు పైగా పరారీలో ఉంది. స‌ద‌రు బాలిక 19 ఏళ్ల ముకుల్ సింగ్ ను ఇష్ట‌ప‌డింది. అయితే వీరి సంబంధాన్ని రైల్వే హెడ్ క్లర్క్ అయిన త‌న తండ్రి రాజ్‌కుమార్‌ అంగీకరించలేదు. దీంతో సెప్టెంబ‌రులో బాలిక ముకుల్‌తో కలిసి పారిపోయింది. పోలీసులు వెంట‌నే ముకుల్ ను పోక్సో చట్టం (POCSO Act) కింద అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె త...
Rapido VOTENOW offer |  సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె
Elections

Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె

Lok Sabha elections 2024: లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప్ర‌ముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో ( Rapido VOTENOW offer ) స‌రికొత్త ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. కంపెనీ ప్ర‌వేశ‌పెట్టిన "సవారీజిమ్మెదరికీ" కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్‌లను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. బెంగుళూరు, మైసూరు, మంగళూరులోని ఓటర్లు ఏప్రిల్ 26న 'VOTENOW' కోడ్‌ని ఉపయోగించి ఓటింగ్ పాయింట్‌లకు వెళ్లడానికి, తిరిగి వెళ్లడానికి ఉచిత రైడ్‌లను పొందవ‌చ్చ‌ని రాపిడో తెలిపింది.Rapido VOTENOW offer : 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI), బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) సహకారంతో బెంగుళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత ఆటో, క్యాబ్ రైడ్‌లను అందించ‌డం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్లు రాపిడో ఒక ప్రకటనలో తెలి...
Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?
National

Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?

Bengaluru Water Crissis ఒకప్పుడు 'వెయ్యి సరస్సుల నగరం' అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్ర‌మంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపె గౌడకు దక్కుతుంది. బెంగుళూరులో న‌దులు లేవు.. నగరం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ బావులు, కాలువల‌ను విస్తృతంగా నిర్మించాడు. ఆ కాలంలో ఇవి వ్యవసాయంతోపాటు పెరుగుతున్న జనాభాకు స‌రిపోయింది. వ‌ర‌ద‌ నీటిని సరస్సుకు తరలించేందుకు కాలువలు నిర్మించ‌డంతో వరదలు, కరువు స‌మ‌స్య‌లు ఏర్పడలేదు. సరస్సులు ఎలా మారిపోయాయి..? 1896 కి ముందు, హేసరఘట్ట నుంచి మొదటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా వచ్చినప్పుడు, సరస్సులు, బావులు బెంగుళూరు నివాసులకు నీటి అవ‌స‌రాలు తీర్చాయి. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి నిర్వహణలో కెంపె గౌడ చేసిన కృషి బెంగళూరు అభివృద్ధికి బీజం ప‌డింది. దక్షిణ భారతదే...
watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..
Viral

watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..

Bengaluru | బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఇటీవల షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన‌ వైరల్ ఫుటేజీలో, ఇద్దరు మహిళా ప్రయాణీకులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.. చివ‌ర‌కు మాటామాటా పెరిగి చెప్పులతో దాడి చేసుకునేవ‌ర‌కు వెళ్లింది. అయితే ఇప్పటి వరకు, సంఘటన ఖచ్చితమైన తేదీ తెలియదు.. మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఆ మ‌హిళ‌లు వినిపించుకోలేదు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.Bengaluru లోని BMTC బస్సులో ఒక మహిళ కిటికీ అద్దం తెరవడంతో గొడవ ప్రారంభమైందని, అయితే అది వెనుక సీట్లో ఉన్న మ‌హిళ‌కు అసౌకర్యాన్ని కలిగించిందని తెలుస్తోంది. దీంతో మహిళలిద్దరూ చెప్పులు తీసి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఘర్షణ తీవ్రమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసు...
Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం
National

Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం

 Massive fire | ఒక బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా అగ్నికీలలుపొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.బెంగళూరు: బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుసుకుంది. (Massive fire) దీంతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు కాలి బూడిదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డిపోలో నిలిచి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్‌ సిబ్బంది 10 ఫైర్‌ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య వెల్లడించారు. మంటల్లో కాలిన ప్రైవేట్‌ బస్సులకు మరమ్మతుల అక...
మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..
National

మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు(Bengaluru) నగరాలను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. .సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 25 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి ఈ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది.రైలు నెంబరు 20703 కాచిగూడ - యశ్వంత్‌పూర్‌(Yeswantpur ) కాచిగూడ( Kacheguda )లో ఉదయం 5.30 గంట...
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత
National

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత

ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నాగ్ పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో మంటలుముంబై-బె...
ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Telangana

ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్న్యూ ఢిల్లీ: హైదరాబాద్ , బెంగళూరులను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande bharath Express) 25 ఆగస్టు, 2023న ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడిచే ప్రస్తుత రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలా కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.హైదరాబాద్ - బెంగళూరు హైదరాబాద్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, బెంగళూరులను కలుపుతుంది, 615 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 15 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ హై-స్పీడ్ సర్వీస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సాఫ్ట్‌వేర్ హబ్‌లు అయిన హైదరాబాద్ బెంగుళూరు మధ్య కీలకమైన నగరాలను కలపుతుంది. బెంగళూరు-హైదరాబాద్ వందే భారత్: స్టాప్‌లు అంచనా హైదరాబాద్‌కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేడం, రాయచూర్ జంక్షన్ ,  గుంతకల్ జంక్షన్‌లో షె...
తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు
Telangana

తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.కాగా కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు..కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరు...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..