
BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..
BAPS Hindu Mandir : అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయాన్ని రేపు 14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన భారీ సమావేశం జరుగుతుంది. దీనికి అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి శంకుస్థాపన చేశారు.
వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా..
ఈ భారీ దేవాలయం (B...