Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: Adilabad

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిం...
పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం
Telangana

పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం

ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు.కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. పొచ్చెర జలపాతానికి కూడా వర్షపు నీరు రావడం ప్రారంభమైంది. కుప్టి గ్రామానికి చెందిన ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ కుంటాల జలపాతం తోపాటు పొచ్చెర జలపాతాలు, సందర్శకులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు జలపాతాల నిర్వహణను అటవీ శాఖ చూస్తోంది. ఇది అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది.జలపాతాల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డు...