Posted in

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..

SCR Special Trains
kachiguda railways station
Spread the love

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ లో ట్రాక్‌ మెయింటెనెన్స్‌ పనుల కోసం ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోనూ రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

రద్దయిన రైళ్ల జాబితా..

  • Trains Cancelled From Kachiguda ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుంతకల్-బీదర్ (07671) మధ్య నడుస్తున్న రైలును రద్దు చేశారు.
  •  ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు బోధన్ నుంచి కాచిగూడ మధ్య నడుస్తున్న (07275) రైలును కూడా రద్దు చేశారు.
  • ఆగస్టు 2-సెప్టెంబర్ 1 కాచిగూడ-గుంతకల్ (07670)
  • ఆగస్టు 1-31 కాచిగూడ-రాయచూర్ (17693)
  • ఆగస్టు 1-31 రాయచూర్-గద్వాల్ (07495)
  • ఆగస్టు1-31 గద్వాల్-రాయచూర్ (07496)
  • ఆగస్టు 1-31 రాయచూర్-కాచిగూడ (17694).
  • ఆగస్టు 1-31 కాచిగూడ-నిజామాబాద్ (07596)
  • ఆగస్టు 1-31 నిజామాబాద్-కాచిగూడ (07593)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-లింగంపల్లి (47222)
  • ఆగస్టు 1-31 లింగంపల్లి-మేడ్చల్ (47225)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47235)
  • ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47236)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47237)
  • ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47238)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47242)
  • ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47245)

ఆగస్ట్ 5 నుంచి 10 వరకు ఈ రైళ్లు ర‌ద్దు..

  • విజయవాడ – భద్రాచలం రోడ్ (07979), భద్రాచలం రోడ్ – విజయవాడ (07278),
  • డోర్నకల్ – విజయవాడ (07755), విజయవాడ – డోర్నకల్ (07756),
  • విజయవాడ – సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్ – విజయవాడ (12714) శాతవాహన ఎక్స్ ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ – గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ రద్దయ్యాయి.
  • పుణె – సికింద్రాబాద్ శతాబ్ది ఎక్ర్ ప్రెస్ (12205) రైలు ఈ నెల 29, 31, ఆగస్ట్ 1వ తేదీల్లో రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్ – పుణె శతాబ్ది ఎక్స్ ప్రెస్ (12206) రైలు ఈ నెల 29, 31వ తేదీల్లో రద్ద‌యింది.

ఈ నెల 30న సికింద్రాబాద్ – ముంబయి ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12220)
ఈ నెల 31న ముంబయి – సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12219) రద్దయ్యాయి.
అలాగే, నిజామాబాద్ – పుణె (11410) ఈ నెల 31న రద్దైంది.

దారి మళ్లింపు..

  • హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ (18046)
  • సికింద్రాబాద్ – విశాఖ మధ్య తిరిగే గోదావరి,
  • సికింద్రాబాద్ – తిరుపతి మధ్య తిరిగే పద్మావతి,
  • సికింద్రాబాద్ – గూడూరు మధ్య తిరిగే సింహపురి,
  • ఆదిలాబాద్ – తిరుపతి మధ్య రాకపోకలు సాగించే కృష్ణా ఎక్ర్ ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

కాచిగూడ-హిసార్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) కాచిగూడ-హిసార్-కాచిగూడ ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు  ప్రకటించింది. రైలు నెం 07055 (కాచిగూడ-హిసార్), గతంలో జూలై 25 వరకు నడపాల్సి ఉంది. తాజాగా ఇప్పుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు పొడిగించనుంది. ఈ రైలు ప్రతి గురువారం నడుస్తుంది. అలాగే ప్రతి ఆదివారం నడిచే రైలు నెం 07056 (హిసార్-కాచిగూడ), గతంలో జూలై 28 వరకు నడపాల్సి ఉంది. ఇప్పుడు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించనున్నారు.


 

 

 

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *