Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

Spread the love

Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వ‌ర‌కు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మ‌రోసారి పోటీ చేస్తార‌ని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్య‌క్తిని ఎంచుకుంది.

గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్‌ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయ‌గా 26 సంవత్స‌రాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శ‌ర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చ‌విచూశారు.

కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు

అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ది. ఇది రాజీవ్ గాంధీ, ఆయ‌న సోదరుడు సంజయ్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లెగసీ సీటు అమేథీ. 1990లో సంజయ్ గాంధీ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు, కానీ ఆ సంవత్సరం విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత 1981లో ఉపఎన్నికలు అనివార్య‌మ‌య్యాయి. రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యే వరకు ఈ స్థానాన్ని ఆయ‌న నాలుగుసార్లు గెలుచుకున్నారు.

రాజీవ్ మ‌ర‌ణానంత‌రం అమేథీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సతీష్ శర్మను ఎంపిక చేసి విజయం సాధించింది. స‌తీష్‌ శర్మ 1996లో రెండోసారి గెలిచారు. కానీ 1998లో ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది.
ఏడాది తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీ తిరిగి బీజేపీ నుంచి గెలుపొంది తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్‌కు సారథ్యం వహించనున్న గాంధీ 2004, 2009, 2014లో ఈ స్థానాన్ని రాహుల్ గాంధీ గెలుచుకున్నారు.

2019లో, రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బిజెపికి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. కానీ కేరళలోని వాయనాడ్‌లో రెండవ సీటును గెలుచుకోవడం ద్వారా ఎంపీగా కొనసాగ‌గ‌లిగారు. ఐదేళ్ల తర్వాత, రాహుల్ మ‌ళ్లీ అమేథీలో పోటీ చేసి గెలవడానికి ప్రయత్నిస్తారనే ఊహాగానాల మధ్య ఆయ‌న వయనాడ్ స్థానానికి తిరిగి పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ వేరే ప్లాన్స్ వేసింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక సీటు అయిన రాయ్‌బరేలీని రాహుల్‌ గాంధీకి అప్ప‌గించి అమేథీలో కిషోరి లాల్ శర్మను బ‌రిలో దింపింది.  సోనియా గాంధీ రాయ్ బ‌రేలీలో 2004 నుంచి వరుసగా ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆమె రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోవ‌డంతో ఆ స్థానం నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారు. 26 ఏళ్ల తర్వాత ఆయన అమేథీ సీటులో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసేందుకు గాంధీయేతర అభ్య‌ర్థి త‌న పోరాటం ప్రారంభించారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *