భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని – INDIA ATTACK PAKISTAN AIRBASE

India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నారు. జనరల్ మునీర్ అర్ధరాత్రి సమయంలో తనకు జరిగిన దాడుల గురించి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత సైన్యం పాకిస్తాన్ పట్ల ప్రతిస్పందించిన తీరు నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారత సైన్యం పాకిస్తాన్ సొంత ప్రదేశంలోకి ప్రవేశించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్ లోని అనేక వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ మిషన్కు సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)అని పేరు పెట్టింది. మొదట పాకిస్తాన్ ప్రధాని ఈ దాడులను ప్రపంచం నుంచి దాచడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ దాడి గురించి ఆయన స్వయంగా తన మాటల్లోనే వివరించారు. భారతదేశం బాలిస్టిక్ క్షిపణులతో పాకిస్తాన్లోని అనేక వైమానిక స్థావరాలపై పేలుళ్లు జరిపిందని అన్నారు.
Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas… Our Air Force used homegrown technology to save our country, and they even… pic.twitter.com/3QFbiij3O6
— ANI (@ANI) May 16, 2025
మునీర్ రాత్రి 2:30 గంటలకు ఫోన్ చేసాడు : షరీఫ్
మే 9-10 రాత్రి తెల్లవారుజామున 2:30 గంటలకు జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ (Asim Munir) తనకు ఫోన్ చేశాడని, భారత క్షిపణులు నూర్ ఖాన్ ఎయిర్బేస్, మరికొన్ని ప్రాంతాలపై పడ్డాయని నాకు తెలియజేశారని చెప్పారు. మన దేశాన్ని రక్షించుకోవడానికి మన వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. వారు యుద్ధ విమానాలలో ఆధునిక గాడ్జెట్లు, సాంకేతికతను కూడా ఉపయోగించారు.
పాకిస్తాన్ మద్దతుతో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన Operation Sindoor లో భారత పాకిస్తాన్లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా కీలకమైన సైనిక స్థావరాలపై కచ్చితత్వంతో వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ దాడి భారత ఆర్మీ దైర్యసాహసాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో PAF చక్లాలా అని పిలువబడే ఈ స్థావరం పాకిస్తాన్ ఎయిర్ మొబిలిటీ కమాండ్కు కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది, సాబ్ ఎరీయే (వైమానిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు), C-130 రవాణా విమానం, IL-78 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు వంటి కీలకమైన ఆస్తులు ఇక్కడే ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.