Sunday, April 27Thank you for visiting

Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం

Spread the love

Pahalgam Terror Attack : అహింసా ధర్మం హిందూ మతంలో పాతుకుపోయిందని, కానీ దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం విధిలో భాగమని హిందూ మతం చెబుతుదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) అన్నారు. శనివారం ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అహింస సూత్రాలు ప్రజలు ఈ ఆలోచనను స్వీకరించడంపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.
చాలా మంది ఈ సూత్రాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు, మరికొందరు అలా చేయరు. సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం కూడా ధర్మం (కర్తవ్యం)లో ఒక భాగమని మతం చెబుతుంది. గూండాలకు గుణపాఠం చెప్పడం కూడా మన విధిలో ఒక భాగం అని స్పష్టం చేశారు..

పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే..

భారతదేశం తన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయలేదని, కానీ ఎవరైనా చెడు తలపెడితే దానికి వేరే మార్గం లేదని ఆయన అన్నారు. “మేము ఎప్పుడూ మా పొరుగువారిని అవమానించం.. హాని చేయం” అని అన్నారు. కానీ ఎవరైనా చెడును ఆశ్రయిస్తే, వేరే మార్గం ఏమిటి? ప్రజలను రక్షించడం రాజు విధి, రాజు తన విధిని నిర్వర్తించాలి.అని అన్నారు.

READ MORE  Astro Horoscope | ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి.. !

సనాతన ధర్మాన్ని దాని నిజమైన అర్థంలో అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, సత్యం, స్వచ్ఛత, కరుణ, తపస్సు అనే నాలుగు సూత్రాలను పాటిస్తే తప్ప మతం మతం కాదని భగవత్ అన్నారు. “దీనికి మించి ఏదైనా అధర్మమే” అని ఆయన అన్నాడు.

‘మతం ఒక సూత్రం’

ప్రస్తుత కాలంలో మతం కేవలం ఆచారాలు, ఆహారపు అలవాట్లకే పరిమితమైందని భగవత్ అన్నారు. “మన మతాన్ని ఆచారాలు, ఆహారపు అలవాట్లకే పరిమితం చేసుకున్నాము, ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు లాంటివి. ఇది ప్రవర్తనా నియమావళి… సూత్రం కాదు. మతం ఒక సూత్రం. “
హిందూ సమాజం హిందూ మతాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, దాని సంప్రదాయాలు, సంస్కృతిని ప్రపంచానికి అందించడానికి ఇది ఉత్తమ మార్గం అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. “హిందూ గ్రంథాలలో ఎక్కడా అంటరానితనం గురించి ప్రస్తావించబడలేదు. ఎవరూ ‘ఎక్కువ’ లేదా ‘తక్కువ’ అని చెప్పరు. ఒక పని పెద్దది, మరొకటి చిన్నది అని కూడా ఎప్పుడూ చెప్పలేదు… అని వివరించారు.

READ MORE  Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

‘ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం’ : Mohan Bhagwat

“ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తుచేస్తోంది. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరు. ఇది మా స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు, నష్టాలను నిశ్శబ్దంగా భరించడం కూడా మా సంస్కృతిలో లేదు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము. చెడును అంతం చేయడానికి మన బలాన్ని చూపించాలి” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు.

READ MORE  వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

“రావణుడు తన మనసు మార్చుకోవడానికి నిరాకరించినందున అతన్ని కూడా చంపారు. వేరే మార్గం లేదు. రాముడు అతన్ని చంపాడు కానీ అతనికి సంస్కరించే అవకాశం కూడా ఇచ్చాడు, అతను సంస్కరించనప్పుడు, ఆ తర్వాతే అతన్ని చంపారు” అని ఆయన అన్నారు.

pahalgam terror attack, jammu kashmir terror attack, india pakistan tension, kashmir valley, mohan bhagwat,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..