Thursday, January 22Thank you for visiting

Local

Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Local
Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెల‌వు. ఇక్క‌డి పండుగ‌ల‌న్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బ‌తుక‌మ్మ‌, బొడ్డెమ్మ, బోనాలు, వినాయ‌క చ‌వితి పండుగలు ముఖ్య‌మైన‌వి. ఇందులో ప‌ల్లెల్లో క‌నిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశ‌స్యం క‌లిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుక‌ల్లో పాల్గొంటారు. ఇది కూడా మట్టి, పూలతో తెలంగాణ ఆట‌పాట‌ల‌తో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమ‌య్యాయి. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు జ‌రుపుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు పిల్ల‌లు బొడ్డెమ్మ‌ను కొలుస్తూ గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు బొడ్డెమ్మ ఆడిన త‌ర్వాత బొడ్డెమ్మను ద‌గ్గ‌ర‌లోని చెరువులు, కుంటల్లో ...
Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..

Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..

Local
Sridevi Sharannavarathrotsavam | గ్రేట‌ర్‌ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని ప్ర‌సిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi)  అమ్మ‌వారి ఆల‌యంలో అక్టోబ‌ర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వరాత్రోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మొదటి రోజు 03-10-2024 గురువారం ఉద‌యం 6-00 గంట‌లకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆల‌య క‌మిటీ తెలిపింది.అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విజయదశమి శనివారం రోజు ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు అర్చనలు, మంగళరతులు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గంట‌లకు జమ్మిపూజ నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 9-00 గంట...
Warangal Inner Ring Road | వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కీల‌క వ్యాఖ్యలు..

Warangal Inner Ring Road | వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కీల‌క వ్యాఖ్యలు..

Local
Warangal Inner Ring Road | వరంగ‌ల్‌ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం వరంగల్ నగర అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ‌రంగ‌ల్‌ స్మార్ట్ సిటీ, భద్రకాళి దేవస్థానం, మెగా టెక్స్ టైల్ పార్కు, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంశాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ ల కోసం రైతు సంతృప్తి చెందేలా మానవీయ కోణంలో భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్ అండ్‌బి అధికారులతో సమావే...
TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు

TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు

Local
హైద‌రాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచింది. గ్రేట‌ర్ శివారు ప్రాంతాల నుంచి ప్ర‌తి రోజు లక్షలాది మంది రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన బ‌స్సు సౌక‌ర్యం లేకపోవ‌డంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీజీ ఆర్టీసీ ఫోక‌స్ పెట్టింది. గురువారం నుంచి ఘట్‌కేసర్ (Ghatkesar), రాజేంద్రనగర్ ( Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు కొత్త‌గా సర్వీసులను ప్రారంభించనుంది.టీజీ ఆర్టీసీ కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur) వెళ్లేందుకు గురువారం నుంచి కొత్తగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 మా...
Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..

Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..

Local
Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. ఇది వన్‌వే ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. రేడియల్‌ రోడ్డులో భాగంగా హెచ్‌సీయూ బస్టాండ్‌ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రాకపోకలు సాగించేలా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. జూన్‌లో ఈ నిర్మాణాన్ని ట్రాఫిక్ కోసం తెరవాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల కారణంగా జాప్యం జ‌రిగింది.Gopanpally flyover  హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ IT కారిడార్‌లలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. ఐటీ ఉద్యోగులతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే రహదా...
Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Local
Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన‌ రైల్ కోచ్ రెస్టారెంట్..  రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేషన్‌లో త్వ‌ర‌లో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ''కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవ‌ల‌ పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయ‌న పరిశీలించారు. ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి? Rail Coach R...
Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..

Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..

Local
జ‌ర్న‌లిస్టుల‌కు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చేస్తా.. పోలీస్‌క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝాWarangal:  వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల‌కు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు త‌లెత్త‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ (Warangal CP) అంబ‌ర్ కిషోర్ ఝా అన్నారు. జ‌ర్న‌లిస్టులు  స‌మ‌స్య‌ల‌ను వెలికితీయ‌డంతోపాటు, ప‌రిష్కార మార్గాల‌ను కూడా సూచించాలని కోరారు.   హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్‌, మైసూర్ వంటి న‌గ‌రాల‌తో స‌మానంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రం అభివృద్ధి చెందాలంటే జ‌ర్న‌లిస్టులు కీల‌క పాత్ర పోషించాల‌ని అన్నారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ స‌భ్యుల‌కు ఐడీ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు వేముల నాగ‌రాజు అధ్య‌క్ష‌త‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బొల్లార‌పు స‌ద‌య్య‌, కోశాధికారి బోళ్ల అమ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్రెస్ క్ల‌బ్ మీటింగ్ హాల్‌లో బుధ‌వారం జ‌రిగింది. ముఖ్య అతిథిగా సీపీ అంబ‌ర్...
బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

Local
warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు.అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ...
15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Local
warangal:  వరంగల్ జిల్లా కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) సిద్ధమైంది. గత నెల వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు కుంకుమ పూజలు, వ్రతాలు, హోమాలతో సందడి నెలకొనగా తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.నవరాత్రి ఉత్సవాలను (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించనున్నట్లు  ఆలయకమిటీ ప్రకటించింది. మొదటిరోజు అక్టోబర్  15 ఆదివారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి 24న విజయదశమి రోజు వరకు నిమిషాంబ దేవి అమ్మవారు ఒక్కొ రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. విజయ...
సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

Local, Telangana
కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యంWarangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ...