Monday, May 4, 2026
National

Indian Railways Latest Update | 7 రైల్వే స్టేషన్ల పేర్లు మారిపోతున్నాయ్.. అవేంటో తెలుసా..

Spread the love

Indian Railways Latest Update : భార‌తీయ రైల్వే స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం ఏడు రైల్వే స్టేషన్‌లపేర్లను త్వరలో మార్చనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కూడా ఆమోదించింది. స్టేషన్ పేరు మార్చడానికి, స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరిగా MHA నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ స్టేషన్లు పేరు మార్చారు.

పేరు మార్చే ప్రక్రియ ఇదీ..

రైల్వే మంత్రిత్వ శాఖ స్వంతంగా స్టేషన్ల పేర్ల‌ను మార్చడం వీలు కాదు. ఈ ప్రతిపాదనను స్టేషన్‌ యంత్రాంగం ప్రారంభించాల్సి ఉంది. ఒక నిర్దిష్ట పేరు రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన తర్వాత, తదుపరి ఆమోదం కోసం ప్రతిపాదన MHAకి పంపుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖను లూప్‌లో ఉంచుతూ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలుపుతుంది. హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్ర‌క‌టించిన తర్వాత, రైల్వేలు కొత్త స్టేషన్ కోడ్‌లు, టికెటింగ్ సిస్టమ్‌లో మార్పులు, ప్లాట్‌ఫారమ్ సంకేతాలు మొదలైన మిగిలిన ప్రక్రియను ప్రారంభిస్తాయి. సాధారణంగా, స్టేషన్ పేరు హిందీ, ఇంగ్లీష్ తోపాటు స్థానిక భాషలో మూడు భాషలలో ప్ర‌చురిస్తారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఏడు రైల్వే స్టేషన్‌ల పేర్లు మార్పు

నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో ఫుర్సత్‌గంజ్, కాసింపూర్ హాల్ట్, జైస్ సిటీ, బని, మిస్రౌలీ, నిహల్‌ఘర్, అక్బర్‌గంజ్‌లతో సహా ఏడు స్టేషన్‌ల పేర్లు మార్చుతున్నారు.

  • ఫుర్సత్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను తాపేశ్వరనాథ్ ధామ్
  • కాసింపూర్ హాల్ట్‌ను జైస్ సిటీగా,
  • జైస్ సిటీని గురు గోరఖ్‌నాథ్ ధామ్‌గా,
  • బనీని స్టేష‌న్ ను స్వామి పరమహంస్‌గా,
  • మిస్రౌలీని మా కాళికాన్ ధామ్‌గా,
  • నిహాల్‌ఘర్‌ను మహారాజా బిజిలీ పాసిగా,
  • అక్బర్‌గంజ్‌ను మా కాళికాన్ ధామ్‌గా

ఈ మార్పులకు సంబంధించిన త్వ‌ర‌లో అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

గ‌తంలో ఏ స్టేష‌న్లు మార్చారు?

గతంలో పలుమార్లు రైల్వే స్టేషన్ల పేరును ప్రభుత్వం మార్చింది. అయోధ్యను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌గా, అలహాబాద్ జంక్షన్‌ను ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌గా, ముఘసరాయ్ జంక్షన్‌ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా, చెన్నై సెంట్రల్‌ను ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌గా, బరోడాను వడోదరగా, బల్సర్‌ను వల్సాద్‌గా, ఒలవక్కోట్‌ను పాల్‌ఘాట్‌గా, బెల్లాసిస్ రోడ్‌ను ముంబై సెంట్రల్గా, బాంబేను ముంబైగా, పూనాను పూణేగా, షోలాపూర్‌ ను సోలాపూర్ భార‌తీయ రైల్వే మార్చేసింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..