Saturday, May 31Welcome to Vandebhaarath

Elections

Elections, #Results #Elections Results Assembly, Parliament,

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..
Elections

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (Palani swami) నాయకత్వంలో పోటీ చేస్తారని అన్నారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తుకు ఎటువంటి షరతులు విధించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎంకె స్టాలిన్ డిఎంకెను ఓడించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), భారతీయ జనతా పార్టీ (...
Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా
Elections

Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా

Haryana Municipal Election Results 2025: గురుగ్రామ్, సిర్సా, ఫరీదాబాద్, పానిపట్, అంబాలా, సోనిపట్ సహా పలు జిల్లాల్లో జరిగిన హర్యానా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం (మార్చి 12) వెల్లడయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 10 మేయర్ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురుగ్రామ్, హిసార్, కర్నాల్, రోహ్తక్, ఫరీదాబాద్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్‌లలో విజయాలు సాధించింది. మానేసర్ మాత్రమే మినహాయింపు, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ బిజెపి అభ్యర్థిని ఓడించారు.మానేసర్, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్, వార్డు సభ్యుల పదవులకు మార్చి 2న ఎన్నికలు జరగగా, పానిపట్ మేయర్ ఎన్నిక మార్చి ...
Delhi Election Results | కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి క‌లుగుతోంది..
Elections

Delhi Election Results | కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి క‌లుగుతోంది..

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిDelhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలి కలుగుతోంద‌ని, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింద‌ని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే న‌మ్మ‌కం లేద‌ని ఇక‌ దేశ ప్రజలు ఎలా విశ్వసిస్తారని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంద‌ని, 2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పె...
Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!
Elections

Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

Exit Polls 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి . ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాయి.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. కొన్ని పోల్స్ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గట్టి పోటీ ఇస్తుంద‌ని వెల్ల‌డించాయి. అదే సమయంలో, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితంకావొచ్చని తేల్చి చెప్పాయి. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో గె...
Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల
Elections

Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

Delhi Election 2025 Schedule Live : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నేటి నుంచి ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమలులోకి రానుంది. ఢిల్లీలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువ‌రించాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. కానీ గ‌త‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది.2020లో ఢిల్లీ ఎన్నికలు జనవరి 6న ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అవినీతి కేసులో బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. ప్రజాకోర్టు తీర్పులో తమ పార...
కొలువుదీరిన మ‌హారాష్ట్ర మంత్రి వ‌ర్గం
Elections

కొలువుదీరిన మ‌హారాష్ట్ర మంత్రి వ‌ర్గం

Maharashtra Cabinet Expansion : బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఆదివారం 39 మంది మంత్రులతో కొలువుదీరింది. బిజెపి (BJP)బలం ఇప్పుడు 42కి చేరుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని మంత్రి మండలిలో గరిష్టంగా ముఖ్యమంత్రి సహా 43 మంది స‌భ్యులు ఉండవచ్చు. 33 మంది శాసనసభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆరుగురు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు లభించగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Shivsena)కు 11, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కి 9 మంత్రి పదవులు లభించాయి. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. 1991 తర్వాత రెండోసారి నాగ్‌పూర్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదీ (Maharashtra Cabinet E...
Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Elections

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీరాజ్యసభ ఉప ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.ఆంధ్ర ప్రదేశ్: ఆర్.కృష్ణయ్యఒడిశా: సుజీత్ కుమార్హర్యానా: రేఖా శర్మరాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్డిసెంబరు 20న ఎగువ సభకు ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలో ఒక్కో సీటు ఖాళీ అయ్యాయి.కొత్త ఎంపీలు వచ్చే సీట్లు ఇవే..ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం ముగ్గురు ఎంపీలను పంపనుంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వ...
Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన
Elections

Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన

Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు "అడ్డంకి" కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు.కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో  అమిత్ షా  సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే "సానుకూలంగా" ఉన్నప్పటికీ  ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మ...
మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు
Elections

మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు

Maharashtra Assembly Elections : మహారాష్ట్ర ఎన్నిక‌ల్లో రాజ్ థాకరే కు చెందిన‌ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ (MNS), అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ పార్టీలో మ‌హాయుతి సూనామీ ముందు కొట్టుకుపోయాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వంటి పార్టీలు కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. MNS 125 మంది అభ్యర్థులను నిలబెట్టగా, VBA 200 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ముంబయిలోని మహిమ్‌ సీటులో పార్టీ అధినేత కుమారుడు అమిత్‌ థాకరే మూడో స్థానంలో నిలవడం ఎంఎన్‌ఎస్‌కు మింగుడు ప‌డ‌లేదు..19 మంది అభ్యర్థులను నిలబెట్టిన రాజు శెట్టి నేతృత్వంలోని స్వాభిమాని పక్ష (Swabhimani Paksha) కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో రైతులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. యాదృచ్ఛికంగా, ఓట్ల ల...
యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..
Elections

యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..

 UP Bypolls 2024 : ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి)తో కలిసి 9 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర , జార్ఖండ్‌లలో రెండో దశతో పాటు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. యూపీ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షమైన‌ ఆర్‌ఎల్‌డీ పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది.UP ఉపఎన్నికల విజయం ఉత్తర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో ఒకదానిలో తన బలమైన పట్టును కొససాగించింది. యూపీలో యుపి ఉపఎన్నికలలో ఎన్‌డిఎ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఓట‌ర్లు ప్రధాని మోదీ నాయకత్వానికి, సిఎం యోగి పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే యోగీ హిందూ ఐక్యత కోసం ఇచ్చిన 'బాటేంగే తో కటేంగే (Batenge Toh Katenge) నినాదం హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించింద‌ని పోల్‌స్టర్లు, విశ్లేషకులు భావిస్తున్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..