Friday, May 16Welcome to Vandebhaarath

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

Spread the love

water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ముంబై:

పెరుగుతున్న నీటి డిమాండ్, అస్థిరమైన వర్షపాతం, తగ్గుతున్న నీటి వనరులతో, నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేగవంతమైన పట్టణీకరణ, సరిపడని మౌలిక సదుపాయాలు,  అసమర్థమైన నీటి నిర్వహణ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు తగ్గిపోవడం..  ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరత కారణంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తరచుగా నీటి కోతలను విధిస్తోంది.

జైపూర్:

జైపూర్ (Jaipur) నగరంలో విస్తరిస్తున్న జనాభా ,  పెరుగుతున్న పారిశ్రామికీకరణ నీటి డిమాండ్‌ను తీవ్రతరం చేసింది. అందుబాటులో ఉన్న సరఫరాను అధిగమించింది. జైపూర్ 20వ శతాబ్దంలో చాలా వరకు రామ్‌ఘర్ డ్యామ్‌పై ప్రాథమిక ఉపరితల నీటి వనరుగా ఉపయోగపడింది.  అయితే, 1980ల చివరలో,  1990ల ప్రారంభంలో, ఈ  డ్యామ్ లో నీటి లభ్యత తగ్గిపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నగరం పూర్తిగా భూగర్భ జలాలపై  ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడింది.   పర్యవసానంగా, ఈ మార్పు నగరంలోని  జలాశయాలు వేగంగా క్షీణించేందుకు  , నీటి కొరత సమస్యను మరింత తీవ్రతరం చేసింది.

బటిండా:

వ్యవసాయం కోసం  మితిమీరిన బోరు బావుల కారణంగా  ఇక్కడ భూగర్భ జలాల నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయి.  నీటిపారుదల కోసం ఈ ప్రాంతం భూగర్భజలాలపై ఎక్కువగా ఆధారపడటం, అసమర్థమైన నీటి వినియోగ పద్ధతులతో పాటు,  జలాశయాల్లో నీటి క్షీణత కారణంగా ఈ నగరం ప్రజల గొంతు ఎండిపోతోంది.

లక్నో:

లక్నోలో రాబోయే నీటి ఎద్దడి గురించి పర్యావరణవేత్తలు ప్రమాద ఘంటికలు మోగించారు.  నగరంలో  నివాసితులు తమ నీటి అవసరాలను తీర్చడానికి ఏటా భాక్రా నంగల్ డ్యామ్ సామర్థ్యంలో మూడింట ఒక వంతుకు సమానమైన భూగర్భ జలాలను వెలికితీస్తారని అంచనా. ఇంకా, 750 పైగా ప్రభుత్వ బోరు బావులు,  550 ప్రైవేట్ బావుల నుంచి మిలియన్ల లీటర్ల భూగర్భ జలాలను వెలికి తీస్తున్నారు.  అస్థిర వర్షపాతం, ఎండిపోతున్న గోమతి  ఉపనదులు, పట్టణీకరణ, నీటి వనరులపై ఒత్తిడిని పెంచుతోంది.  భవిష్యత్ లో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చెన్నై:

చెన్నైలో గణనీయమైన వార్షిక వర్షపాతం 1,400 మిల్లీమీటర్లు ఉన్నప్పటికీ.. నగరం 2019లో భయంకరమైన నీటి సంక్షోభంలో చిక్కుకుంది.నగర  జనాభా అవసరాలను తీర్చడానికి రోజువారీ 10 మిలియన్ల లీటర్ల నీటి రవాణా  డిమాండ్ ఏర్పడిన మొదటి ప్రధాన నగరాల్లో ఒకటిగా చెన్నై అవతరించింది. ఇటీవలి సంవత్సరాలలో నగరం గణనీయమైన వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, వేగవంతమైన పారిశ్రామికీకరణ,  పట్టణీకరణతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా  నీటి సంక్షోభానికి గురవుతుంది.

ఢిల్లీ:

ప్రతి వేసవిలో, యమునా నది కాలుష్యం,  భూగర్భజలాల క్షీణత కారణంగా తీవ్ర నీటి కొరతతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటాయి. ఢిల్లీ జల్ బోర్డ్ సరఫరా చేసే నీటిలో అరవై శాతం కలుషిత యమునా నుంచి తీసుకోగా, మిగిలినది భూగర్భ జలాల నుండి వస్తుంది. భూగర్భ జలాల క్షీణతను అరికట్టేందుకు  నీటి నాణ్యతను మెరుగుపరచడం ఢిల్లీ యొక్క నీటి కష్టాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..