
రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలుహైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.MJ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్ను అవసరాన్ని బట్టి GPO అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్ను అలస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ తదితర ప్రాంతాలకు అవసరమైన ప్రాతిపదికన మళ్లిస్తారు. పిసిఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బిజెఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.నాలుగు చక్రాల వాహనాల (ఫోర్ వీలర్స్) పై నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను గృహ కల్ప, గగన్ విహార్, ...




