Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త..  త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు

Telangana
TGSRTC | కిక్కిరిసిపోయిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రోడ్లపైకి మరో 1500 బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని స్యయంగా  రవాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామ‌ని,  త్వ‌ర‌లో మ‌రో 1500 కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని ప్రకటించారు. ఈమేరకు  శ‌నివారం నల్లగొండ బస్ స్టాండ్ లో కొత్త‌ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో నల్లగొండ నుంచి హైదారాబాద్ కు 3 డీలక్స్, ఒక ఏసీ బస్సు ,ఒక పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి.ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు మంత్రులు బస్సులో ప్రయాణించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ  కార్మికుల‌కు (TGSRTC Employees ) 21 శాతం పిఆర్సి అందించామని, 3035 ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని నియామక ప...
Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Telangana
Driving License Rules | అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి అక్రమాలకు ఇక చెల్లవు.  అడ్డదారిలో లైసెన్స్  పొందేవారిని కట్టడి చేసేందుకు ఆర్టీఏ అధికారులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియకు  ఆధునిక హంగులు జోడించారు. ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షకు స్వస్తి చెప్పి ప్రామాణికమైన ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల  ఇక నుంచి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నవారు కచ్చితంగా ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్టు పాస్ కావాల్సిందే..  రోడ్లపై నిత్యం ఎదురయ్యే  ఇబ్బందులను ఈ కొత్త టెస్ట్‌ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనాన్ని నడిపినప్పుడు కంప్యూటర్‌లో పూర్తిగా రికార్డు అవుతుంది. దీంతో అంతా కరెక్టుగా వాహనం నడిప...
Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Telangana
Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌లుజిల్లాల్లో స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో క‌రువు ప‌రిస్థితులు వ‌స్త‌యేమోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ కేంద్రం వ‌ర్షాల‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. ఈమేర‌కు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైద‌రాబాద్ ప‌రిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్క‌డ‌ సాధారణ పరిధి 154 ...
Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..

Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..

Telangana
Medchel :  దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం  కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు.  మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో  విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి మేడ్చల్‌ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.  గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్...
Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

Andhrapradesh, Telangana
తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ - విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు.భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ...
మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్

మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్

Telangana
Miyapur-Patancheru Metro corridor | మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ (సుమారు 13 కి.మీ), గంగారం వద్ద 1.2 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది.  గంగారం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నందున  మెట్రో రైల్ అధికారులు ఈ పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.కాగా మియాపూర్ - పటాన్‌చెరు కారిడార్ కోసం, BHEL జంక్షన్‌లో మినహా NH సెంట్రల్ మీడియన్‌లో మెట్రో వయాడక్ట్ నిర్మించాలని ప్రతిపాదించారు. జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద, ప్రతిపాదిత BHEL మెట్రో స్టేషన్‌ను TGSRTC బస్ స్టాప్‌తో అనుసంధానిస్తూ, ఫ్లైఓవర్  ఎడమ వైపుకు మెట్రో అలైన్‌మెంట్ తీసుకున్నారు.  గత రెండు రోజులుగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) MD NVS రెడ్డి HAML...
New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

Telangana
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) (Secunderabad to Goa Express) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను నడిపించ‌నున్న‌ట్లు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప్రకటించింది.ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో ప్రారంభమవుతుంది. కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, గుంతకల్‌, బళ్లారి, హోసపేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాజిల్‌ రాక్‌, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్‌ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.ప్రస్తుతం, సికింద్రాబాద్ నుండి 10 కోచ్‌లతో వీక్లీ రైలు బయలుదేరి గుంతకల్ (ఆంధ్రప్రదేశ్) చేరుకుంటుంది. గుంతకల్ వద్ద, తిరుపతి నుండి మరో 10 కోచ్‌లను జోడించి, గో...
AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

Andhrapradesh, Telangana
AP, TG CM's Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.విభజన చట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇద్ద‌రు సీఎంలు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిన‌ట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్ల‌డించారు. ప్రజాభవన్‌లో సీఎంల‌ సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు స...
Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

Telangana
Telangana Heavy Rains | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ‌నున్నాయ‌నిపేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప‌లుచోట్ల వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చ‌రించింది.ఇక‌ సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ‌ జిల్లాలో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తాయని...
Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..

Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..

Telangana
Cherlapalli Railway Terminal | హైదరాబాద్ నగర శివారులోని చెర్లపల్లిలో ప్ర‌యాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి, ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధ‌మ‌వుతోంది. విమానాశ్రయాల త‌ర‌హాలో అత్యంత ఆధునిక సౌకర్యాల‌తో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది. ఈ చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక రైళ్ల ఆలస్యానికి త్వరలో చెక్ పడనుంది.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల‌కు నిత్యం భారీ సంఖ్య‌లో వ‌చ్చిపోయే ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. అయితే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ అందుబాటులోకి వ‌స్తే ఆయా స్టేష‌న్ల‌పై భారం త‌గ్గిపోతుంది. అనేక రైళ్లు చెర్లపల్లి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ‌ టెర్మినల్స్ వద్ద ...