Tuesday, April 8Welcome to Vandebhaarath

Tag: SCR

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు
National

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధి ప‌నులు (Warangal Railway Station) శ‌ర‌వేగంగా కొస‌సాగుతున్నాయి. వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేష‌న్ ముఖ ద్వారం సుంద‌రీక‌రించ‌డంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది.ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు ర...
కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..
National

కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..

Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. కాగా హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్ లో కూడా 65 శాతం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సమగ్ర పునరుద్ధరణ తర్వాత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌ ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది.ఏయే సౌకర్యాలున్నాయి?బేగంపేట స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో చాలావరకు భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయిఎంట్రీ ర్యాంప్ : కొత్త ఎంట్రీ ర్యాంప్‌ని ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్‌కి ప్రయాణికులు సులభంగా ప్రవేశించవచ్చు. విభిన్న రకాల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ఈజీగా స్టేషన్ లోకి రాకపోకలు చేయవచ్చ...
MMTS Trains |  ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌
Andhrapradesh, Telangana

MMTS Trains | ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌

హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించిన‌రైలు సర్వీసులు ఇవీ..మేడ్చల్ - లింగంపల్లి (47222), లింగంపల్లి - మేడ్చల్ (47225), మేడ్చల్ - సికింద్రాబాద్ (47228) మరియు సికింద్రాబాద్ - మేడ్చల్ (47229).వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికుల కోసం అద‌న‌పు కోచ్ లు.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లను జోడించింది. తాత్కాలిక అదనపు కోచ్‌లు ఉన్న రైళ్ల జాబితా ఇదీ..విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెం-07783), గుంటూరు - విజయవాడ (ట్రైన్ నెం-07788), నడికుడి - మాచర్ల (ట్రైన్ నెం-07579), మాచర్ల - నడికుడే (ట్రైన్ నెం-07580), గుంటూరు-మాచర్ల (ట్రైన్ నెం-07779) మాచర్ల-గుంటూరు (ట్రైన్ నెం-0...
ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..
Trending News

ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

Secunderabad Railway Station : హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రయాణికులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరించిన స్టేషన్, ప్రస్తుతం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. అయితే ఈ స్టేష‌న్‌ వచ్చే ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది.ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజీ స్క్రీనింగ్, వెయిట్-ఇన్ లాంజ్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్లాట్ ఫాంపై నిలిచి బ‌య‌లుదేరేముందు మాత్ర‌మే ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమ‌తించ‌నున్నారు. దీనివ‌ల్ల ప్లాట్ ఫాంపై ప్ర‌యాణికులు కిక్కిరిసిపోయే ప‌రిస్థితి ఉండ‌దు. భోపాల్ స్టేష‌న్ త‌ర్వాత‌.. రూ.700 కోట్ల భారీ వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి మోడ్ర‌న్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌ను పటిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన ఎయ...
Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్..  నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..
తాజా వార్తలు

Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..

Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి ప‌నులు, మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా ప‌లు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్‌ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని సూచించింది. కాచిగూడ-మెదక్‌ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్ర‌క‌టించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..కాచిగూడ-నిజామాబాద్‌(07596), నిజామాబాద్‌-కాచిగూడ(07593), మేడ్చల్‌-లింగంపల్లి(47222), లింగంపల్లి-మేడ్చల్‌ (47225), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47235), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47236), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47237), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47238) మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47242), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47245), మేడ్చల్‌-సికిం...
సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!
Telangana

సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!

Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసిన‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్‌ స్టాప్‌ సమయంలో మార్పులు చేసిన‌ట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండ‌గా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ మార్పు అక్టోబరు 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా రైల్వేస్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులు లేవని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వ...
SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..
Trending News

SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది.ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ - షాలిమార్ (12774); షాలిమార్ - సికింద్రాబాద్ (12773); సికింద్రాబాద్ - విశాఖపట్నం (22204); విశాఖపట్నం - సికింద్రాబాద్ (12805); సికింద్రాబాద్ - విశాఖపట్నం (20707); విశాఖపట్నం - సికింద్రాబాద్ (20708) మరియు సికింద్రాబాద్ - విశాఖపట్నం (20834) రైళ్ల ను ర‌ద్దు చేశారు. షెడ్యూల్‌లో ఈ మార్పుల‌ను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాలని SCR అధికారులు ప్ర‌యాణికుల‌ను అభ్యర్థించారు. తిరువనంతపురం వైప...
Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?
Telangana

Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను త‌ల‌పించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చ‌ర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని స‌క‌ల స‌దుపాయాల‌తో హైటెక్ హంగుల‌తో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌక‌ర్యాలు ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిచేయ‌లేదు.రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను ప‌లు కార‌ణాల ద్వారా ప్రారంభించ‌లేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సి...
Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు
Telangana

Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు

Charlapalli Railway Terminal |  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్, అలాగే లింగంపల్లి  రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్ లో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో రైల్వే స్టేషన్ బయటే గంటల కొద్దీ  పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 200 రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.ఈ మూడు స్టేషన్లపై ఉన్న భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రైల్వే జంక్షన్ గా చర్లపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.450 కోట్లతో  టెర్మినల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇప్పటిరకు 95 శాతం పూర్తి కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నా...
New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు
Telangana

New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు

New Railway Lines | తెలంగాణలో కొత్త రైల్వేపనులను ముందుకు నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట్-మెదక్, భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్లతో సహా తెలంగాణ ప్రభుత్వం నుంచి మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు భూమి వాటా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొంతకాలంగా వేచి చూస్తోంది. కొత్తపల్లి - మనోహరాబాద్ లైన్ 151.36 కి.మీ పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టుకు ₹2,780.78 కోట్ల అంచనా వ్యయం (భూమి ధర మినహాయించి), రాజన్న సిరిసిల్లలో దాదాపు 15.3 హెక్టార్ల అటవీ భూమికి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. సిద్దిపేట నుంచి మరో ఐదు హెక్టార్లు, రాజన్న-సిరిసిల్లలో 42.4 హెక్టార్లు, కరీంనగర్ జిల్లాల నుంచి 38.2 హెక్టార్లు ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రైల్వే పనుల కోసం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి మొత్తం 1,073.7 హె...