
Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా
Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్ర పూరీ క్షేత్రం సన్నద్ధమవుతోంది. రథయాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. జూలై 7న జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రథయాత్రకు
హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము
అయితే ఈసారి రథయాత్ర ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది రథయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేయడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగ...