Saturday, July 5Welcome to Vandebhaarath

Tag: hyderabad

IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో  భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Trending News

IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

IRCTC Economy Meals | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.  జనరల్ క్లాస్ కోచ్‌లలో ప్ర‌యాణించేవారికి అతిత‌క్కువ ధ‌ర‌ల‌కు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ (Economy Khana ) అందించే ఐఆర్సీటీసీ తన ప్రాజెక్టును మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించింది. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన 'ఎకానమీ ఖానా' అందిస్తున్నామ‌ని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఆహార ప‌దార్థాల‌, నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను ప‌ర్య‌వేక్షించేందుకు తాము నిరంతరం నిఘా పెడ‌తామ‌ని వారు తెలిపారు. ఈ చొరవ ఎందుకు తీసుకున్నారు? వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. IRCTC అధికారి మాట్లాడుతూ, "మేము వేసవి కాలంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామ‌ని అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న ...
Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..
Telangana

Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..

Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుద‌లయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి వోజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేశారు. బాలికలదే హ‌వా ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రంలో 60.01 శాతం, రెండో సంవ‌త్స‌రంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా, అందులో 2.87 లక్షల మంది పాస్ అయ్యారు. ఇంట‌ర్‌ సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజ‌రు కాగా, 3.22 లక్షల మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఈసారి కూడా బాలుర కంటే బాలికలే ముందున్నారు. బాలికలు ఫస్టియర్ లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాల...
Hyderabad Lok Sabha elections | హైదరాబాద్‌లో 5.41 లక్షల మంది న‌కిలీ ఓటర్లను తొల‌గించిన ఎన్నికల సంఘం
Elections

Hyderabad Lok Sabha elections | హైదరాబాద్‌లో 5.41 లక్షల మంది న‌కిలీ ఓటర్లను తొల‌గించిన ఎన్నికల సంఘం

 Hyderabad Lok Sabha elections 2024: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ‌ల‌ ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీ ఓట్ల‌తో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది.తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మే 13న నాలుగో విడ‌ల‌తో ఓటింగ్ జరగనుంది. ఏఐఎంఐఎం కంచుకోటగా నిలిచిన హైదరాబాద్  లోక్ సభ స్థానంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా  హాట్ సీట్ గా నిలిచింది. .అయితే ఓట్ల తొలగింపుపై జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితా స్వచ్ఛతకు కృషిచేస్తోందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ECI నిబంధనలకు కట్టు...
SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..
Telangana

SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

SCR Special Trains | తెలుగు రాష్ట్రాల‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెల‌వుల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖ‌రులో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవ‌కాశ‌ముంది. దీంతో చాలా మంది వివిధ సమ్మ‌ర్ వెకేష‌న్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. ఇందులో కొన్ని రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి న‌డ‌వ‌నున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. పాట్నా-సికింద్రాబాద్‌ (03253) మధ్య మే 1 నుంచి జూలై 31 వరకు ప్రతీ సోమ, బుధవారాల్లో నడుస్తుంది. హైదరాబాద్‌ – పాట్నా (07255) రైలు మే ...
Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు
Telangana

Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు

Cherlapally Railway Terminal |  ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో  కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం ఉంది. అయితే  రైల్వే టర్మినల్  అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని ట్రైన్స్ ను చర్లపల్లి టెర్మినల్కు మార్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆరు లైన్లతో అత్యాధునిక స్టేషన్ అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చర్పలల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ...
Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..
Trending News

Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

Bharat Rice | పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్‌ రైస్ (Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌) (NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలు ఈ భార‌త్ రైస్ ను విక్ర‌యించాల‌న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్ హైద‌రాబాద్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్‌ రైస్ అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. గ‌త‌ 15 రోజులుగా విక్ర‌యాలు కొన‌సాగుతున్నాయ‌ని నాఫెడ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా భార‌త్ రైస్ పై త‌గినంత ప్రచారం లేకపోవడంతో 15రోజులుగా అమ్మ‌కాలు...
Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Telangana

Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Special Trains వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. అందరూ సమ్మర్ వేకేషన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరగనుంది.  ప్రయాణికుల నుంచి వస్తున్నడిమాండ్ ను పరిగణలోకి తీసుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  ఈ మేరకు.. వివిధ ప్రాంతాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ నడుపనున్నట్టు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.దక్షిణ మధ్య రైల్వే (SCR) ప‌రిధిలో ప‌లు ప్రాంతాలను కలుపుతూ 48 ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ - నాగర్‌సోల్ (ట్రైన్ నంబర్. 07517) ఏప్రిల్ 17 , మే 29 మధ్య నడుస్తుంది, నాగర్‌సోల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 07518) ఏప్రిల్ 18, మే 30 మధ్య నడుస్తుంది.అదేవిధంగా, ప్రత్యేక రైలు హైదరాబాద్ - కటక్ (ట్రైన్ నంబర్ 07165) మంగళవారం (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23 , ఏప్రిల్ 30) నడుస్తుంది, కటక్-హైదరా...
Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
Telangana

Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో హీట్ వేవ్ హెచ్చరిక (Heat Wave Warning)జారీ చేసింది.వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 3 వరకు ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో హైదరాబాద్ ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్‌లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.ఏప్రిల్ 2న ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.ఈ జిల్లాలతో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లలో కూడా ఏప్రిల్ 3, 4 తేదీల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంద...
Elevated Corridor | రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ తో ఆరు జిల్లాలకు ప్రయోజనం..
Telangana

Elevated Corridor | రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ తో ఆరు జిల్లాలకు ప్రయోజనం..

Elevated Corridor | ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నగరం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వరకు ట్రాపిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) ప్రాంతంతో ఇరుకైన రోడ్డులో వాహనదాారులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. క్యారిడార్ నిర్మాణం రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం సమీపంలో గల ప్యాట్నీ సెంటర్ నుంచి ప్రారంభమై కార్ఖానా, తిరుమలగిరి, బల్లారం, ఆళ్వాల్, హకీంపేట, తూంకుంట. మీదుగా శామీర్ పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి రాజీవ్ ర‌హ‌దారిపై 11.12 కిలో మీట‌ర్ల పొడ‌వుతో ఆరు లైన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు....
Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?
Special Stories

Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?

Kompella Madhavi Latha | హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ఇక్క‌డ ఆరు ప‌ర్యాయాలు ఎంపీగా విజ‌యం సాధించిన తిరుగులేని నేత‌గా ఉన్న ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై పోటీగా పాత‌బ‌స్తీకి చెందిన అగ్నికణం వంటి  కొంపెల్ల మాధ‌వీల‌త‌ను బీజేపీ అధిష్ఠానం బ‌రిలో నిలుపుతోంది. అయితే హైద‌రాబాద్ స్థానానికి  49ఏళ్ల మాధ‌వీల‌త‌ను  ఎంపిక చేయ‌డానికి కార‌ణ‌మేంటి? హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో ఒకటైన విరించి హాస్పిటల్స్‌కు ఆమె చైర్మన్‌గా ఉన్నారు.ఆమె గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇపుడుతెలుసుకుందాం.. డాక్టర్ గా, సామాజికవేత్తగా .. కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత .. నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ, కోటి మహిళా కళాశాల నుండి పొలిటిక‌ల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఎన్ స...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..