Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Election Commission of India

SIR : నేడు కేర‌ళ‌లో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

SIR : నేడు కేర‌ళ‌లో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

National
భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కీలక అడుగు వేసింది. కేరళలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తి కావడంతో, ఈరోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తోంది.పలు రాష్ట్రాల్లో సవరించిన జాబితాలుకేరళతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ & నికోబార్ దీవులలో కూడా SIR ప్రక్రియ తర్వాత సవరించిన జాబితాలు ప్రచురించబడనున్నాయి. ఇప్పటికే బీహార్‌తో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ECI ఈ ప్రత్యేక తనిఖీని ప్రకటించింది, ఇది దాదాపు 51 కోట్లకు పైగా ఓటర్లను కవర్ చేస్తుంది. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ముసాయిదా జాబితాలు విడుదలయ్యాయి.SIR అంటే ఏమిటి?స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో నవీకరించే ప్రక్రియ.ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (BLO) నేరుగా ఇంటింటికీ వెళ్లి పత్రాలను సేక...
బీహార్ SIR మొదటి దశ పూర్తయింది.. డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల మంది తొలగింపు

బీహార్ SIR మొదటి దశ పూర్తయింది.. డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల మంది తొలగింపు

Trending News
బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ రివిజన్ తొలి దశ పూర్తిచేసిన ECI7.24 కోట్ల మందితో రికార్డు స్థాయిలో బీహార్ ఓటర్ల ధృవీకరణ65 లక్షల ఓటర్ల తొలగింపు ప్రక్రియకు తెరలేపిన ECI – ముసాయిదా జాబితా ఆగస్టు 1నబీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మొదటి దశను భారత ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది.ఈ మేర‌కు ఈసీఐ ఆదివారం ప్ర‌క‌టించింది. ఈ ప్రక్రియలో 7.89 కోట్ల ఓటర్లలో 7.24 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.సవరణ ప్రక్రియను చేపట్టాలనే ECI నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్న ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. 2025 జూన్ 24 నుంచి జూలై 25 వరకు జరిగిన ఈ గణనలో మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో 7.24 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన‌డం విశేషం.ECI ప్రకారం ఈ ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో అత్యంత విస్తృతమైన ఓటరు ధృవీకరణ కార్య‌క్ర‌మంలో ఒకటిగా భావిస్త...
ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే..  ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Andhrapradesh, Elections
Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం.ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబ...
Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) త‌మ‌కు ఓటు వేయ‌కుంటే క‌రెంట్ క‌ట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ స‌ర‌ఫ‌రా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేద‌ని తన వ్యాఖ్య‌ల‌కు కట్టుబడి ఉంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ ప‌రిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగ‌కుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్‌ కట్‌ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిప‌డింది. కాం...
Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Elections
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది.EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్లలో తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పా...
Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచ‌న‌లు ఇవే..

Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచ‌న‌లు ఇవే..

Trending News
Heatwave Warning | వేస‌విలో తీవ్రమైన ఎండ‌ల నుంచి ప్రాణాంతక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని ప‌నుల‌ జాబితాను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (EC ) జారీ చేసింది.2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.ఈ నేపథ్యంలోనే ఈసీ ఓట‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది.IMD అంచనాకు సంబంధించి, EC ఒక వివరణాత్మక సలహాను జారీ చేసింది, ఇది హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి, తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (National Disaster Management) జ...
Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

National, Trending News
Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది...ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీకాలం కూడా జూన్‌తో ముగియనుంది. రానున్న ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు.గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది. "12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. అంటే ఇక్...
అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ

అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ

Telangana
హైదరాబాద్: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లతో పాటు మరో 10 మంది పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం(Election commission ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భోంగిర్, నిర్మల్ జిల్లాల్లోని జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో)లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది.ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొమ్మిది మంది జిల్లా మేజిస్ట్రేట్లు/డీఈవోలు, 25 మంది పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు/ఏడీఎల్‌లను బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది. ఎస్పీలు, నలుగురు కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్యానెల్‌ను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదే...
 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

National
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ‌తోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు నవంబరు 15 చివరి తేదీ. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 35,356 పోలి...
సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం

సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం

Local
18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్వీప్ ఓటరు నమోదు, ఓటు హక్కు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఓటురుగా నమోదైన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక కాంపెయిన్లో భాగంగా ఈ నెల 26 , 27వ తేదీల్లో అలాగే వచ్చే నెల 2, 3వ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెప...