
ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్
న్యూఢిల్లీ: నోయిడా(Noida)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్లో కమీషన్ ఏజెంట్ నుంచి అప్పుగా తీసుకున్న రూ.3వేలు చెల్లించకపోవడంతో వెల్లుల్లి వ్యాపారని కొట్టి, బలవంతంగా బట్టలు విప్పి ఊరేగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏజెంట్తో సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం వెల్లుల్లి వ్యాపారి నెల క్రితం కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి రూ. 5,600 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఆదియాస్ అని పిలిచే ఈ ఏజెంట్లు రైతులకు, కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తులుగా ఉంటారు. మార్కెట్లో క్రయవిక్రయాలపై వీరికి పట్టు ఉంటుంది. అయితే సోమవారం వ్యాపారి రూ.2,500 తిరిగి ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత సమయం అడిగాడు.దీంతో ఆగ్రహం చెందిన సుందర్.. ఇద్దరు కూలీలకు ఫోన్ చేశాడు. వారు వెల్లుల్లి విక్రేతను ఒక దుకాణంలోకి తీసుక...