Floating screen in Ayodhya | రామ మందిరం ఈవెంట్ను వీక్షించేందుకు భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్
అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో రామ్ లాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సమీపిస్తున్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను కనీవిని ఎరుగని రీతిలో అధ్యాత్మిక కేంద్రంగా (నవ్య, భవ్య, దివ్య) అలంకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
యూపీ CMO అధికారిక ప్రకటన ప్రకారం, UP ప్రభుత్వం.. శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ సన్నాహాల్లో భాగంగా చౌదరి చరణ్ సింగ్ ఘాట్లో దేశంలోనే అతిపెద్ద తేలియాడే స్క్రీన్ (Floating screen in Ayodhya ) ను నిర్మిస్తోంది. ఇది తరువాత ఆర్తి ఘాట్లో అమర్చబడుతుంది. దీనిపై రాముడి ప్రాణ ప్రతిష్ఠను కార్యక్రమాలతోపాటు అయోధ్య అభివృద్ధి ప్రయాణం గురించి ప్రదర్శిస్తుంది. .అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఆగస్టులో సెంచరీ హాస్పిటాలిటీ-మెగావర్స్ అసోసియేట్తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసిందని అధికారిక ప్రకటన పేర్కొంది.
ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ వల్ల సందర్శకులు, స్థానికులు జనవరి 22న శ్రీరామ మందిరంలో జరిగే ప్రాణ్-...