Sunday, April 27Thank you for visiting

ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

Spread the love

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్‌(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మసీదును పరిశీలిస్తే అచ్చం పురాత హిందూ దేవాలయంగా కనిపిస్తుంది. మొఘలులు హిందూ దేవాలయాలను ద్వంసం చేసి మసీదులుగా మార్చివేశారనేందానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది.

అయితే ఈ మసీదు ఆలయాన్ని తలపిస్తున్నదని ఇది ఎప్పటి నుంచో జైన, హిందూసంఘాల ఆధీనంలో ఉందని, నిర్మాణంపై ఉన్న “ముస్లింల ఆక్రమణలను” తొలగించాలని
పేర్కొంటూ స్థానిక హిందూ సంఘాలు, పాండవ్వాడ సంఘర్ష్ సమితి ఆరు నెలల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతామని
హెచ్చరించారు. దీనిపై స్పందించిన అక్కడి కలెక్టర్ తాజాగా నిషేధం విధించారు. కాగా ఈ మసీదు 13వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటిదని, ఈ ప్రార్థనా స్థలం 1861లో ఉందని నిరూపించే పత్రాలు తమ వద్ద ఉన్నాయని మసీదు ట్రస్టీలు
పేర్కొన్నారు

READ MORE  యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు 

పాండవ్వాడ మసీదుగా పేరు..

ఈ మసీదుని పాండవ్వాడ మసీదు అని కూడా పిలుస్తారు. మహాభారతంలోని పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో కొన్ని నెలలు ఎరండోల్‌లో గడిపారని. అందుకే ఈ ప్రాంతానికి పాండవ్వాడ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. వాడా అనేది మహారాష్ట్రలోని బహిరంగ ప్రాంగణాల చుట్టూ నిర్మించిన పెద్ద, రెండు-అంతస్తుల సాంప్రదాయ నివాసాలను సూచిస్తుంది.

అయితే గత మంగళవారం మసీదు ట్రస్ట్ నుండి వచ్చిన పిటిషన్‌పై స్పందించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్, మసీదులో ప్రార్థనలను ఆగష్టు 1 వరకు రెండు వారాల పాటు
నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులను నిలిపివేసింది. మసీదు తాళాలు కూడా కలెక్టర్‌కు అందజేయాలని ఆదేశించింది.

‘ఒక జైన దేవాలయం’

మే 18న పాండవ్వాడ సంఘర్ష్ సమితి అనే బృందం జల్గావ్ జిల్లా కలెక్టర్‌కు ఒక  దరఖాస్తును సమర్పించింది, ఇది నిర్మాణం మసీదు కాదని, ఇది ఒక దేవాలయమని, ఇది
అక్రమంగా వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయబడిందని పేర్కొంది. “మేము దానిని పాండవ్వాడ అని పిలుస్తాము” అని సమితి సభ్యుడు ప్రసాద్ దండవతి
పేర్కొన్నారు. “ఇది జైన దేవాలయం.” పురావస్తు రికార్డులు  కూడా దీనిని దేవాలయంగా గుర్తించాయి. మసీదు స్మారక చిహ్నంలో ఖురాన్‌పై తరగతులను నిర్వహించడం
ప్రారంభించిన తర్వాత ఈ బృందం జిల్లా అధికారులనుసంప్రదించవలసి వచ్చింది. బ్రిటీష్ కాలంలో జైన దేవత లార్డ్ పరస్నాథ్ విగ్రహం నిర్మాణం ఉండేదని బృందం పేర్కొంది. కాగా
బృందం దరఖాస్తు ఆధారంగా, జిల్లా కలెక్టర్ జూలై 11మ సీదులో ప్రార్థనలను నిషేధించారు .

READ MORE  Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు

జూలై 13న, జుమ్మా మసీదు ట్రస్ట్ సభ్యులు, హిందూ గ్రూపు సభ్యులిద్దరూ ఈ విషయంపై తమ వైఖరిని జిల్లా కలెక్టర్‌కు వివరించడానికి అవకాశం ఇచ్చారు. జూలై 11 నాటి ఉత్తర్వును సవాలు చేస్తూ ట్రస్ట్ బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌ను కూడా ఆశ్రయించింది. ముస్లింలను మసీదులోకి ప్రవేశించకుండా కలెక్టర్ నిషేధించడం
సరికాదని వాదించారు. Pandavwada Temple

Pandavwada Temple

చరిత్ర: 
మహారాష్ట్ర ప్రభుత్వం 1977లో ఈ కట్టడాన్ని “పాండవ్వాడ మసీదు” పేరుతో పురాతన,  చారిత్రాత్మక స్మారక చిహ్నంగా ప్రకటించింది. మహారాష్ట్ర పురాతన స్మారక చిహ్నం,
పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టాలు, 1960 ప్రకారం దీనిని రక్షిత స్మారక చిహ్నంగా చేర్చిందని మసీదు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
1992-’93లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగినప్పుడు జుమ్మా మసీదు దాడి జరిగింది. ముస్లిం నివాసితుల ప్రకారం, కొంతమంది
మసీదుపై దాడి చేసి దాని ముందు తలుపును ధ్వంసం చేశారు. ట్రస్టు అధికారులు  స్థానిక అధికారులకు సమాచారం అందించగా వారు మరమ్మతులు చేశారు. 2009లో, వక్ఫ్ చట్టం 1995లోని నిబంధనల ప్రకారం మసీదు వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయబడింది.

READ MORE  మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు

అయితే, పాండవ్వాడ సంఘర్ష సమితి తన దరఖాస్తులో, ఈ భవనం 1995లో నాసిక్  పురావస్తు శాఖ పర్యవేక్షణలోకి వచ్చిందని, వక్ఫ్ బోర్డుది కాదని పేర్కొంది. మహారాష్ట్ర
ప్రభుత్వం ఆ స్థలంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేసిందనే వాస్తవాన్ని రుజువుగా పేర్కొంది.

ఇటీవల, 2012లో, ఎరండోల్ మునిసిపల్ కౌన్సిల్ మసీదు ఆవరణలో పబ్లిక్ గార్డెన్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు ట్రస్ట్ వక్ఫ్
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో ఆ ప్రయత్నాన్నిమునిసిపల్ కౌన్సిల్ ప్లాన్‌ను పెండింగ్‌లో ఉంచింది.


Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

అలాగే ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..