Friday, February 14Thank you for visiting

Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..

Spread the love

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన “చేదు అవమానం” కారణంగా  JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత చంపాయ్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు.

“ఢిల్లీ,  కోల్‌కతాలో జార్ఖండ్ ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన తర్వాత, బిజెపిలో చేరాలనే నా సంకల్పం బలపడింది” అని ఆయన అన్నారు. గిరిజనుల ప్రగతిని కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించిన సోరెన్, “ప్రజలకు న్యాయం చేసేందుకు తానుకట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. “నేను నా చెమట, రక్తంతో JMM ను పోషించాను, కానీ ఎన్నో అవమానాలకు గురయ్యాను. అందుకే నేను బిజెపిలో చేరవలసి వచ్చింది. నేను ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అవమానాలను భరించే స్థితిలో లేను, ” అని సోరెన్ అన్నారు.

READ MORE  ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

శిబు సోరెన్ కు సన్నిహితుడు..

67 ఏళ్ల చంపాయ్ సోరేన్ BJPలో చేరడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. బలమైన షెడ్యూల్డ్ తెగలతో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన చేరిక పనిచేస్తుంది. అతను జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు సన్నిహితుడు. రాష్ట్ర హోదా కోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించినందుకు చంపయ్  సోరెన్ ను ‘జార్ఖండ్ టైగర్’గా  పిలుస్తారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేయడం.. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత చంపాయ్  ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు,

READ MORE  అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే 'వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

చంపాయ్ జూలై 3న తన సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్‌ (Hemant Soren) కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత జూలై 4న తిరిగి ఆయన సీఎంగా అధికారాన్ని చేపట్టారు. బుధవారం పార్టీ అధినేత శిబు సోరెన్‌కు రాసిన లేఖలో చంపాయ్ మాట్లాడుతూ, “JMM ప్రస్తుత శైలి, దాని విధానాల పట్ల బాధతో” తాను నిష్క్రమించవలసి వచ్చింది. ‘‘నాకు కుటుంబం లాంటి పార్టీ అయిన జేఎంఎం నుంచి నిష్క్రమిస్తానని నేనెప్పుడూ ఊహించలేదు…గతంలో జరిగిన పరిణామాల కారణంగా చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ’ అని లేఖలో పేర్కొన్నారు.

బీజేపీలో చేరాలనే నిర్ణయాన్ని ప్రకటించేందుకు చంపాయ్ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఢిల్లీలో కలిశారు. “బంగ్లాదేశ్ నుంచి  చొరబాటు కారణంగా రాష్ట్రంలోని సంతాల్ పరగణాలో ప్రమాదంలో ఉన్న గిరిజన ఉనికిని కాపాడేందుకు తాను పార్టీ మారతానని మంగళవారం చంపై చెప్పారు. ఈ చొరబాటుదారులు స్థానిక ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా హాని కలిగిస్తున్నారని, వారిని అరికట్టకపోతే, “సంతల్ పరగణాలోని మన సమాజం ఉనికి ప్రమాదంలో పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. పాకూర్, రాజ్‌మహల్‌తో సహా అనేక ప్రాంతాల్లో గిరిజనుల కంటే చొరబాటుదారుల సంఖ్య ఎక్కువగా ఉందని చంపాయ్ ఆరోపించారు.

READ MORE  Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం

చంపాయ్ సోరేన్ రాజకీయ ప్రస్థానం..

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగోరా గ్రామంలో నవంబర్ 11, 1956న సోరెన్ జన్మించారు. 1991లో సరైకేలా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1995లో మళ్లీ జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నాలుగేళ్ల త‌ర్వాత ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేఎంఎం టికెట్‌పై పోటీ చేసి బీజేపీకి చెందిన పంచు తుడిని ఓడించారు.


న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..