హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి

హైటెక్ ఫీచర్లతో  స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి
Spread the love

ఇండియన్ రైల్వేస్.. ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌ల (New Vande Bharat Trains With Sleeper Coaches) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’( Koo)లో పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి.

“వందే భారత్ ద్వారా కాన్సెప్ట్ రైలు (స్లీపర్ వెర్షన్) త్వరలో వస్తుంది… 2024 ప్రారంభంలో వస్తుంది’’ మంత్రి (Railway Minister, Ashwini Vaishnaw) కూలో రాశారు.
వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో విశాలమైన బెర్త్‌లు, ప్రకాశవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, అధునాతన భద్రతా ఫీచర్లతో సహా అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్‌ల కంటే ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయని భావిస్తున్నారు.


వందే భారత్ స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టడం భారతీయ రైల్వేలకు ఒక కీలకమైన పరిణామం, ఎందుకంటే ఇది ప్రయాణికులు రాత్రిపూట హై-స్పీడ్ రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఇది రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని.. రైల్వేల్లో మొత్తం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.

Also Read  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా: రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్‌ వివరాలు ఇవీ..

ప్రగతిశీల, స్వావలంబన కలిగిన భారతదేశానికి చిహ్నంగా ఈ స్వదేశీ సెమీ లైట్ స్పీడ్ రైలు (Vande Bharat ) ప్రయాణికులకు పూర్తిగా కొత్త ప్రయాణ అనుభూతిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి వేగం, భద్రత, మెరుగైన సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచ స్థాయి ఫీచర్లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది.

న్యూఢిల్లీ – వారణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 15, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారైన ఈ రైలు ‘మేక్-ఇన్-ఇండియా’ స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుంది. భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటుతుంది.
స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైలు సెట్‌లను తయారు చేసే ప్రాజెక్ట్ 2017 మధ్యలో ప్రారంభమైంది. 18 నెలల్లోనే ICF చెన్నై రైలు-18ని పూర్తి చేసింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *