Friday, January 23Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

Trending News
దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్‌ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం. పూర్తిగా మహిళా పైలట్లే.. దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో...
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

Trending News
చండీగఢ్‌: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్‌ వాహనం కనిపించింది. కానీ లాక్‌ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్‌ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోనికి ఎక్కించారు.కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్‌ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇంతలో పోలీసు వాహనంలో ఉన్న...
ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

Trending News
ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్ ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో కొంతమంది అసభ్యకరమైన రీతిలో దుస్తులతో కనిపించడంతో 'నీతి' సబ్‌కమిటీ ('Niti' sub-committee ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని, దురదృష్టవశాత్తూ కొందరు ఇతరుల మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ అన్నారు. "కొంతమంది చిరిగి...
Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Trending News, World
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు.కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...
ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు:  అయోధ్య ట్రస్ట్

ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్

Trending News
Ayodhya: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Temple) నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. శనివారం మూడు గంటలపాటు ట్రస్ట్ అధికారుల సమావేశం జరిగింది. అనంతరం, విదేశీ కరెన్సీలో విరాళాలు తీసుకునే చట్టపరమైన ప్రక్రియతో సహా 18 అంశాలపై చర్చించామని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం కింద అనుమతి కోసం ట్రస్ట్ దరఖాస్తు చేసిందని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. "ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023 వరకు ఆలయ నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,000 కోట్లకు పైగా ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లోనే మిగిలి ఉంది" అని చంపత్ రాయ్ చెప్పారు. జనవరి 2025 నాటికి ఆలయం మూడు దశల్లో పూర్తవుతుందని తెలపిారు. .సరయూ నది ఒడ్డున ...
dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

Trending News
Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు.ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చాడని భావించారు. అయితే కవర్ లో దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, " నా దుకాణం చుట్టూ మురుగు నీరు నిలిచి ఉంది. అక్కడ విపరీతంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం వద్ద మాకు తీవ్రమైన దోమలు, విషకీటకాల సమస్య ఉంది అని వివరించాడు. "నన్ను నేను రక్షించుకోవడానికి దోమల సమస్యను పరిష్కరించడానికి, నేను కొన్ని దోమలను పాలిథిన్...
టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

Trending News
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్ లో చదివిన ఈ ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్ ను మాట్లాడుతామని బయటకు పిలిచారు. తమ వెంట తెచ్చిన గన్ తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది మరోవైపు టీచర్‌ కాలుపై కాల్పులు (Students Shoot Teacher జరిపి ప...
Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ

Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ

Trending News
Uber driver harassing incident : రాజస్థాన్‌లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్‌ నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మనాలి గుప్తా తన కూతురిని స్కూల్ నుండి తీసుకువెళ్లడానికి వెళుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి వివరిస్తూ.. వీడియోను షేర్ చేసింది. వీడియోలో, మనాలి తనతో ఏమి జరిగిందీ.. ఉబర్ డ్రైవర్ తనను ఎలా వేధించాడో వివరించిందితన కూతురిని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు రైడ్ బుక్ చేశానని, తాను ఎవరితోనో కాల్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్ అకస్మాత్తుగా తన ఫోన్ లాక్కోవడానికి యత్నించాడని వివరించింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయి అతడిని వారించేందుకు ప్రయత్నించింది.. కానీ డ్రైవర్ దూషించడం మొదలుపెట్టాడు.Uber driver harassing incident  మనాలి కారును ఆపమని డ్రైవర్‌ని చాలాసార్లు చెప్పినా కూడ...
ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో  నేలమట్టం..

ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో నేలమట్టం..

Trending News
 ujjain horror : ఇటీవల యావత్ దేశాన్ని కలచివేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచార ఘటనలో నిందితుడి ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేయించింది. 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు భరత్ సోనీకి చెందిన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ నేలమట్టం చేసింది. నివేదికల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు బుధవారం కూల్చివేశారు.తర్వాత అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయడానికి బుల్‌డోజర్‌ను అక్కడికి తీసుకువచ్చారు. వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్‌ సోనీని గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. 12 ఏళ్ల బాలికపై భరత్ సోనీ అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక చిరిగిపోయిన దుస్తులతో వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి సాయం అడిగింది. అయితే ఆ బాధితురాలికి ఎవరూ సహాయం చేయలేదని మీడియాలో వార్తలు వచ్చాయి....
215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

Trending News
తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో జరిగిన నాటి ప్రభుత్వ అధికారుల దురాగతానికి సంభందించిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది  అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులందరూ  దోషులుగా మద్రాస్ హైకోర్టు నిర్ధారించింది. ఈమేరకు శుక్రవారం అన్ని అప్పీళ్లను కొట్టివేసి గతంలో సెషన్స్ కోర్టు  ఇచ్చిన తీర్పును సమర్థించింది."బాధితులు, ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా, స్థిరంగా ఉన్నాయని ఈ కోర్టు కనుగొంది, అవి నమ్మదగినవి" అని ప్రాసిక్యూషన్ తన సాక్ష్యం ద్వారా తన కేసును రుజువు చేసిందని జస్టిస్ పి వెల్మురుగన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.జూన్ 20, 1992న, అధికారులు స్మగ్లింగ్ గంధపు చెక్కల కోసం   వాచాతి గ్రామం పై దాడి చేశారు. ఈ దాడిలో, ఆస్తి, పశువుల విధ్వంసం చేయడమే కాకుం...