EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన
TGSRTC EV Bus | పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. జిసిసి మోడల్లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టిసి) ఫ్లీట్కు ఎలక్ట్రిక్ బస్సులను మరిన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో సహా ఇతర మంత్రులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. డీజిల్తో నడిచే కాలం చెల్లిన బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్ర...