Ekadashi – 2025 | శాకంబరీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి
భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలువరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆలయంలో ఆదివారం ఏకాదశి (Ekadashi ) పూజలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మహిళలు నిమిషాంబ దేవి అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకులు లక్ష్మీనరసింహ చార్యులు, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కె. సురేష్ అధ్యక్షులు, వెంకటేశ్వర్ వర్మ, సంతోష్ బాబు, విజయరాజ్, సునీల్ కుమార్, సంజయ్ కుమార్, రమేష్, రాందాస్, వెంకటేశ్వర్లు, సుగుణాకర్ తోపాటు స్థానిక కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కళ్యాణి, శోభారాణి, కావిక...