
Special Train | సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
Special Train : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్-భావ్నగర్తో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-భావనగర్ (07061) మధ్య జూలై 19, 26వ తేదీ నుంచి ఆగస్టు 2, 9వ తేదీల్లోఈ ప్రత్యేక రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అలాగే భావ్నగర్-సికింద్రాబాద్ (07062) రైలు జూలై 21, 28, ఆగస్టు 4, 11వ తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు గమ్యస్థానం చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
హాల్టింగ్ స్టేషన్లు..
ఈ రైళ్లు రెండు మార్గాల్లో మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖ్దేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాషిమ్, అకోల, భుస్వాల్, నందుర్బర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్, విరాంగమ్, సురేంద్రనగర్, ధోలా, సోంగద్ తదితర...