రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..
సుపారీ గ్యాంగ్ అరెస్టు
హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో గిరబోయిన అంజయ్య(55), గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, డోలకొండ శ్రీకాంత్(22), బచ్చన్నపేట, జనగామ జిల్లా, శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్(27). బచ్చన్నపేట ఉన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు.భూ వివాదం నేపథ్యంలో..కాగా ...