Thursday, June 19Thank you for visiting

Tag: Rahul Gandhi

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

Trending News
PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది.ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవి...
కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

National, తాజా వార్తలు
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ త‌ర్వాత‌ వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నిక‌ల్లో పోటి చేయ‌నున్న‌ట్లు వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయ‌లేదు. గ‌తంతో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె యూపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తన మనసులో మాట బయటపెట్టారు.. కానీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌లేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ యూపీలోని రాయ్ బ‌రేలీ, కేర‌ళ‌లోని వాయ‌నాడ్ రెండు సీట్లల్లో పో...
Rahul Gandhi | వీసీల నియామకాలపై రాహుల్ గాంధీ ‘తప్పుడు ప్రచారం’.. చర్యలు తీసుకోవాలని 181 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ

Rahul Gandhi | వీసీల నియామకాలపై రాహుల్ గాంధీ ‘తప్పుడు ప్రచారం’.. చర్యలు తీసుకోవాలని 181 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ

National
Rahul Gandhi | న్యూఢిల్లీ: యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అసత్య ప్రచారం చేశారని, వైస్ ఛాన్సలర్ల పరువు తీశారని ఆరోపిస్తూ మాజీ, ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌లతో సహా కనీసం 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖపై సంతకం చేశారు. రాహుల్‌ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి వైస్ ఛాన్సలర్‌లను కేవలం మెరిట్‌తో కాకుండా ఏదో ఒక సంస్థతో అనుబంధం ఆధారంగా నియమించారని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ నిరాధారమైన ఆరోపించారని వీసీలు, విద్యావేత్తలు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.విద్యావేత్తలు చెబుతున్న‌దాని ప్రకారం, వైస్-ఛాన్సలర్‌లను విద్యార్హతల కంటే కనెక్షన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అయితే ఈ వాదనలను సంతకం చేసినవారు తీవ్రంగా ఖండించా...
lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

Elections
Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వ‌ర‌కు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మ‌రోసారి పోటీ చేస్తార‌ని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్య‌క్తిని ఎంచుకుంది.గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్‌ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయ‌గా 26 సంవత్స‌రాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శ‌ర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చ‌విచూశారు. కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో ప...
Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Elections
Rae Bareli : కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోట‌లుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్య‌ర్థ‌ల ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంది పార్టీ నాయ‌కత్వం. ఈ కీల‌క‌మైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా ప...
Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి

Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి

Elections
Wayanad : వామపక్షాలు ఎంత వ్యతిరేకించినా రాహుల్ గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌లు భారత కూటమిలో భాగమే, అయినా కూడా ఈ రెండు పార్టీలు కేరళ రాష్ట్రంలో పరస్పరం పోటీ పడుతున్నాయి. అయితే కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ప్రధాన కార్యదర్శి పిఎం సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత సుధాకరన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎంపీ, వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ..  ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని  అన్నారు. " అయనకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. మరొమారు గెలిపిస్కతే వాయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తారనిసుధాకరన్ విమర్శించారు.ఇదిలా ఉండగా, 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్లే, ఈసారి వాయనాడ్‌  పార్లమెంట్‌ సీటు (...
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

National
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ 'ధైర్య పోరాటం' చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా "spoon-fed kids" అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు. "రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఆయ‌న చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారి...
Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

National
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోట‌లా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవ‌రిని నిలుపుతుంద‌నే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవ‌రు ఉంటారు అని విలేఖ‌రులు అడుగ‌గా, "ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూ...
Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !

Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !

National
Congress candidates |వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను  విడుదల చేసింది. ఈ లిస్టులో పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, బీహర్ నాయకుడు కన్నయ్య కుమార్ పేర్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, పంజాబ్ లోని జలంధర్ (ఎస్సీ) నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు.ఫతేగఢ్ సాహిబ్ (ఎస్సీ) నుంచి అమర్ సింగ్, అమ్రుత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా,  సిద్సంగ్రూర్ నుంచి సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పాటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ,భాటిండా స్థానానికి జీత్ మొహిందర్ సింగ్, యూపీలోని అలహాబాద్ స్థానానికి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ ను పోటీలో నిలిపింది. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కోసం 75 మంది అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించింది....
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..